Redmi A5 4G: ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమి తన బడ్జెట్ స్మార్ట్ఫోన్ లైనప్ను మరింత విస్తరించే దశలో, భారత మార్కెట్లో కొత్తగా రెడ్మీ A5 4G స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ను ప్రవేశపెట్టిన షియోమి.. ఏప్రిల్ 15న భారత మార్కెట్లో అధికారికంగా ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. వినియోగదారులకు బడ్జెట్ ధరలలో మంచి ఫీచర్లను అందించే దిశగా షియోమి ఈ ఫోన్ను రూపొందించింది.…
Honda Hness CB350: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా తన ప్రసిద్ధ మోడల్ Hness CB350 యొక్క 2025 వెర్షన్ను భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మూడింటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. DLX, DLX Pro, DLX Pro Chrome వేరియంట్లలో లభిస్తుంది. తాజా మోడల్లో పొందుపరిచిన ఆధునిక ఫీచర్లు, పర్యావరణ అనుకూలతతో ఇది మోటార్సైకిల్ ప్రియులను ఆకర్షించేలా ఉంది. ఈ కొత్త హ్నెస్ CB350 ప్రధాన ప్రత్యేకత దాని ఇంజిన్లో…
దక్షిణ కొరియా కార్ల తయారీదారు కియా జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ కియా ఈవీ6ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు ఫేస్లిఫ్ట్ మోడల్ అధికారికంగా భారత మార్కెట్లో అమ్మకానికి విడుదల చేసింది. కంపెనీ దీనిని GT-Line AWD అనే ఒకే ఒక వేరియంట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 65.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన కొత్త సూపర్కార్ వాన్క్విష్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన V12 ఇంజిన్తో కూడిన ఈ సూపర్ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 8.85 కోట్లు (ఎక్స్-షోరూమ్). ప్రపంచవ్యాప్తంగా 1,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ యూనిట్లలో కొన్ని భారతదేశంలో కూడా అమ్మకానికి ఉంచనుంది. అయితే, భారతదేశంలో ఎన్ని యూనిట్లను అమ్మకానికి ఉంచారనే దానిపై కంపెనీ సమాచారం ఇవ్వలేదు.