India-EU Trade Deal: చారిత్రాత్మక భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఈ ఒప్పందం కోసమే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్,యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా భారత పర్యటనలో ఉన్నారు. వీరిద్దరిని భారత 77వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. మంగళవారం, ప్రధాని మోడీతో ఈయూ చీఫ్ ఉర్సులా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ట్రేడ్ డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.
Ursula von der Leyen: యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, భారత 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ‘‘విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా చేస్తుంది’’ అని అన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) కూటమి-భారత్ మధ్య జరిగే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఈయూ చీఫ్, తాను భారతదేశ…