India-EU Trade Deal: యూరప్ కార్లపై భారీగా సుంకాల తగ్గింపు.. వోక్స్ వ్యాగన్, బెంజ్, బీఎండబ్ల్యూలు మరింత చవక..
- ఈయూ కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు..?
- భారత్-ఈయూ ట్రేడ్ డీల్లో భాగంగా చర్యలు..
- మరింత చవకగా వ్యోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ, బెంజ్ కార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-EU Trade Deal: చారిత్రాత్మక భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఈ ఒప్పందం కోసమే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్,యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా భారత పర్యటనలో ఉన్నారు. వీరిద్దరిని భారత 77వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. మంగళవారం, ప్రధాని మోడీతో ఈయూ చీఫ్ ఉర్సులా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ట్రేడ్ డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలు భారీగా తగ్గించాలని భారత్ యోచిస్తోంది. ఈయూ తయారీ కార్లై 110 శాతం నుంచి 40 శాతానికి సుంకాలను తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్లోని విస్తారమైన మార్కెట్ను ఈయూకు తెరిచే ప్రక్రియలో ఇది కీలకం కానుంది. 27 దేశాల కూటమి అయిన ఈయూ నుంచి 15,000 యూరోలు (రూ. 16.3 లక్షల) దిగుమతి ధర కలిగిన పరిమిత సంఖ్యలో కార్లపై పన్నును వెంటనే తగ్గించడానికి ప్రధాని మోడీ సర్కార్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సంవత్సరానికి సుమారు 200,000 డిజిల్- పెట్రోల్ కార్లపై దిగుమతి సుంకాలను తక్షణమే 40%కి తగ్గించాలని న్యూఢిల్లీ ప్రతిపాదించిందని సోర్సెస్ చెబుతున్నాయి. ఈ సుంకాలను కాలక్రమేణా 10 శాతానికి తగ్గిస్తారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
ఈ నిర్ణయంతో ఈయూ మార్కెట్ నుంచి వచ్చే వోక్స్ వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ప్రసిద్ధ కంపెనీలకు భారత మార్కెట్లోకి ప్రవేశం మరింత సులువుకానుంది. ప్రస్తుతానికి చర్చల విషయాలు గోప్యంగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో మార్చులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ, యూరోపియన్ కమిషన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.
భారత్-ఈయూ మధ్య ట్రేడ్ డీల్ను ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా ఈయూ చీఫ్ ఉర్సులా అభివర్ణించారు. మంగళవారం స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కోసం సుదీర్ఘ చర్చలకు ముగింపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించగలదు. ఆగస్టు నుంచి 50 శాతం అమెరికా సుంకాలతో దెబ్బతిన్న భారత వస్త పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమలు యూరప్ దేశాలకు తమ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది.
తక్కువ దిగుమతి పన్నులు వోక్స్వ్యాగన్, రెనాల్ట్ , స్టెల్లాంటిస్ వంటి యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారులకు, అలాగే భారతదేశంలో స్థానికంగా కార్లను తయారు చేస్తున్నప్పటికీ, అధిక సుంకాల కారణంగా ఒక స్థాయికి మించి వృద్ధి చెందడానికి ఇబ్బంది పడుతున్న మెర్సిడెస్-బెంజ్ మరియు బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ సంస్థలకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. యూరోపియన్ కార్మేకర్స్ భారత్లో ప్రస్తుతం 4 శాతం కన్నా తక్కువ వాటాను కలిగి ఉన్నారు. అమెరికా, చైనా తర్వాత కార్ మార్కెట్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ ఏడాదికి 4.4 మిలియన్ కార్ యూనిట్ల మార్కెట్, దీనిలో మారుతి సుజుకీ, మహీంద్రా, టాటాలలు కలిసి మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి. 2030 నాటికి భారత్ మార్కెట్ ఏడాదికి 6 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా.
తాజావార్తలు
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..