Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Why Pakistan Worried India Eu Free Trade Deal

India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’తో పాకిస్తాన్‌లో భయం మొదలు..

Published Date :January 31, 2026 , 12:48 pm
By BV Reddy
  • భారత్-ఈయూ ట్రేడ్ డీల్‌తో పాకిస్తాన్‌లో కంగారు..
  • తమ మార్కెట్ దెబ్బతింటుందని దాయాదిలో భయం..
India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’తో పాకిస్తాన్‌లో భయం మొదలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా చెప్పబడుతున్న ఇండియా-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) అమెరికాతో పాటు పాకిస్తాన్‌కు కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న దాయాది దేశానికి ఈ ఒప్పందం మరింత ఆందోళనలను, భయాన్ని కలిగిస్తోంది. పాక్ నుంచి యూరప్‌కు ఎక్కువగా వస్త్రాలు, దుస్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ డీల్‌తో పాకిస్తాన్ వ్యాపారానికి భారత్ గండికొడుతుంది.

యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్‌కు రెండో అతిపెద్ద ఎగుమతి మార్కెట్. దాని వార్షిక ఎగుమతుల్లో 9 బిలియన్ డాలర్లు( రూ. 8.25 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రమాదంలో పడింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం తర్వాత తమ ఎగుమతులపై ప్రభావం పడకుండా ఈయూతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. భారత్-ఈయూ మధ్య డీల్ ఒకే కావడంతో పాక్ ప్రభుత్వం కంగారులో పడింది. పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్‌తో మంత్రులు సమావేశమయ్యారు. దీనికి ముందు పాక్ ప్రధాని, ఈయూ రాయబారి మధ్య సమావేశం జరిగింది.

పాక్ భయాలకు కారణం ఇదే..

భారత్-ఈయూ డీల్‌తో పాక్ ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారుతాయి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, పాక్ ఎగుమతి వాటా 1990లో జీడీపీలో 16 శాతం ఉంటే, ఇది 2024లో దాదాపు 10 శాతానికి పడిపోయింది. మరోవైపు, ఈయూ పాకిస్తాన్‌కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్ (GSP+) హోదా ఇచ్చింది. దీని ద్వారా పాక్ 66 శాతం ఎగుమతులు ఎలాంటి సుంకాలు లేకుండా ఈయూ మార్కెట్‌లోకి వెళ్తున్నాయి. దీని కారణంగా పాకిస్తాన్ యూరప్‌కు వస్త్ర ఎగుమతులు 108 శాతం పెరిగాయి. పాక్‌ ఇచ్చిన ఈ హోదా వచ్చే ఏడాదితో ముగుస్తోంది. ఇది పాక్‌లో మరింత భయాన్ని పెంచుతుంది. పాక్ పారిశ్రామిక ఉత్పత్తుల్లో వస్త్రరంగం అతిపెద్దది. ఈ రంగం 15 నుంచి 25 మిలియన్ల మందికి ఉపాధి ఇస్తుంది.

భారత్‌కు ప్రయోజనం:

భారత్ వస్త్ర ఎగుమతులు ప్రస్తుతం ఈయూ మార్కెట్‌లో 12 శాతం సుంకాలను ఎదుర్కొంటున్నాయి. వాణిజ్య ఒప్పందం కుదిరితే వెంటనే భారతీయ వస్త్ర ఎగుమతులపై జీరో సుంకాలు అమలవుతాయి. భారత్ నుంచి ఈయూకు వెళ్లే దాదాపు 99 శాతం ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు ఉండవు. ఈయూ నుంచి వచ్చే 97 శాతం సరకులకు సుంకాలు ఉండవు.

ట్రంప్ సుంకాలతో దెబ్బతిన్న దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, ఫుట్‌వేర్ ఇండస్ట్రీలు ఈ డీల్‌తో మళ్లీ పుంజుకోనున్నాయి. భారత్ ఎగుమతులతో యూరప్ మార్కెట్ నిండిపోతే, పాకిస్తాన్‌కు ఇబ్బందులు తప్పవు. ఇది బంగ్లాదేశ్ విషయంలో కూడా వర్తిస్తుంది.

పాక్‌పై తీవ్ర ప్రభావం:

ఈయూతో ట్రేడ్ డీల్‌తో ఇప్పుడు మొత్తం పరిస్థితి మారుతుంది. భారత ఉత్పత్తులు ఈయూ మార్కెట్‌లో గణనీయమైన పోటీని ఇస్త్తాయి. ఈయూ తన వాణిజ్యాన్ని అమెరికా, చైనాలను దాటి వైవిధ్యపరచాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు GSP+ హోదా పొడిగిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. పాక్ మాజీ వాణిజ్య మంత్రి డాక్టర్ గోహర్ ఎజాజ్ మాట్లాడుతూ.. ఈయూ మార్కెట్‌లో పాకిస్తాన్ ఉన్న ‘‘జీరో టారిఫ్ హనీమూన్’’ ముగిసిందని అన్నారు. దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించారు. పరిస్థితిని గమనించిన పాకిస్తాన్ ప్రభుత్వం పరిశ్రమలకు విద్యుత్ ధరల్ని తగ్గించే చర్యల్ని ప్రారంభించింది. పారిశ్రామిక వినియోగదారుల కోసం యూనిట్ రూ. 4.04 మేర విద్యుత్ ధర తగ్గించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India EU FTA
  • India EU textiles
  • India EU trade deal
  • India Europe trade agreement
  • Pakistan exports Europe

తాజావార్తలు

  • Income Tax: ఇన్‌కమ్ టాక్స్ నిబంధనల్లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేవి ఇవే..

  • Vishwanath & Sons: 40 ఏళ్ళ అంకుల్’ని 20 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తే?

  • Telangana Assembly : ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 20న బడ్జెట్..

  • Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • Sunil Gavaskar: పాక్‌ క్రికెటర్‌ కొనుగోలుపై విమర్శలు.. కావ్య మారన్‌ను నిలదీసిన గవాస్కర్..

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions