Home
India Economy
India Economy News
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
దేశంలో పెరుగుతున్న ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుండే పని చేసే (Work From Home) విధానాన్ని పాటించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, దేశీయ ఐటీ హబ్లలో ఒకటైన హైదరాబాద్పై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం సుమారు 9 లక్షల మంది… -
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే దిశగా సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు సరఫరాకు ఆటంకాలు కలగవచ్చనే ఆందోళనల మధ్య, భారత్ తన విదేశీ మార్పిడి నిల్వలను కాపాడుకోవడానికి ఇప్పటికే బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' ప్రాంతంలో అనిశ్చితి నెలకొనడం వల్ల క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.… -
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
CM Chandrababu : దేశ పారిశ్రామిక పురోగతిలో భారత పరిశ్రమల సమాఖ్య (CII) కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు-2026లో పాల్గొన్న ఆయన, భారతదేశ ఆర్థిక వృద్ధి , భవిష్యత్తు సవాళ్లపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుస్థిరమైన పాలన అందిస్తూ, దేశాన్ని ప్రపంచ పారిశ్రామిక పటంలో అగ్రగామిగా నిలబెడుతున్నారని ఆయన ప్రశంసించారు. వినూత్న ఆలోచనలు , స్పష్టమైన లక్ష్యాలతో… -
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
PM Modi: తెలంగాణ నుంచి దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కీలక సూచనలు చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలోని యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ చమురు సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో దేశం నుంచి విదేశీ మారక ధనం వెళ్లకుండా స్వదేశీ ఉత్పత్తులకు పెద్ద పీట వేయాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్… -
War Effect : నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోన్న యుద్ధ సంక్షోభం
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ సంక్షోభం ఇప్పుడు నేరుగా సామాన్యుడి సొంతింటి కలపై ప్రభావం చూపుతోంది. పశ్చిమాసియాలో (Middle East) ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యంగా విశాఖపట్నం వంటి నగరాల్లో గ్యాస్ ఆధారిత సిరామిక్ , యూపీవీసీ (uPVC) పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితంగా బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. భారతదేశంలో తయారయ్యే సిరామిక్ ఉత్పత్తుల్లో సుమారు 90 శాతం… -
Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న మందులు, పెయింట్ల ధరలు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి బడ్జెట్పై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం అంతర్జాతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా, మన దేశంలోని మందులు , పెయింట్ల ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. ముఖ్యంగా ఔషధ రంగంపై ఈ ప్రభావం అత్యంత ఆందోళనకరంగా ఉంది. మన దేశంలో తయారయ్యే అనేక మందులకు అవసరమైన ముడి పదార్థాలు (Raw Materials) పశ్చిమాసియా , చైనా దేశాల నుండి దిగుమతి అవుతాయి. Botsa… -
Big News : రేపటి నుంచి దేశవ్యాప్తంగా పెరగనున్న సిమెంట్ ధరలు
సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి చేదు వార్త. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు రేపటి నుంచి భారీగా పెరగనున్నాయి. సిమెంట్ కంపెనీలు బస్తాపై గణనీయమైన ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే డీలర్లకు సమాచారం అందించాయి. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సిమెంట్ బస్తా (50 కేజీలు) ధరపై రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరగనుంది. దీంతో ప్రముఖ కంపెనీల సిమెంట్ బస్తా ధర మార్కెట్లో సుమారు రూ. 360కి… -
Budget 2026: జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా..
Budget 2026: 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు (Fiscal Deficit) కేంద్రం అంచనా వేసింది. ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026లో ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గడం గమనార్హం. -
Union Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్.. ఆసక్తిగా చూస్తున్న దేశం..
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు( ఆదివారం) పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ -2026ను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను మరింత పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉండబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ బడ్జెట్పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రక్షణ, మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్, గృహనిర్మాణం, రక్షణపై బడ్జెట్ ఫోకస్ చేయనుంది. వరసగా 9వ సారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను… -
India Economy: భారత డిజిటల్ ఆర్థికవ్యవస్థను మార్చుతున్న Gen Z.. ఎక్కువగా దేనికి ఖర్చు చేస్తున్నారంటే..?
India Economy Gen Z: భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకు చూడని తరహా మార్పును చూస్తోంది. ఖర్చులు ఎలా చేయాలి..? ఎలా సేవ్ చేసుకోవాలి..? క్రెడిట్ను ఎలా వినియోగించాలి..? అనే దానిపై దేశ యువత తమదైన ముద్ర వేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ గ్రూప్ మద్దతుతో పనిచేస్తున్న యువతకు అనుగుణమైన UPI ఫింటెక్ ప్లాట్ఫారమ్ సూపర్ మనీ (Super Money) విడుదల చేసిన తొలి వార్షిక వినియోగదారుల అధ్యయనం ‘superSpends 2025’ ఈ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది.…
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!