Kiren Rijiju: రాహుల్ గాంధీ పిల్లవాడు కాదు, దేశ ప్రతిష్టకు హాని కలిగించొద్దు..
- ట్రంప్ వ్యాఖ్యల్ని రాహుల్ గాంధీ సమర్థించడంపై సర్వత్రా ఆగ్రహం..
- ఇండియా ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందన్న ట్రంప్..
- రాహుల్ గాంధీ చిన్న పిల్లవాడు కాదు..
- దేశాన్ని ఈ విధంగా అవమానించకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమర్థించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’అని ట్రంప్ చెప్పడాన్ని రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. అయితే, ఈ విషయంపై కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఆయనను విమర్శించారు. ప్రతిపక్ష నేత ‘‘చిన్నపిల్లవాడు కాదు’’ అని, దేశ ప్రతిష్టను ఈ విధంగా దెబ్బతీయకూడదని తెలుసుకోవాలని హితవు పలికారు.
‘‘రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇది సరైనది కాదని ప్రతిపక్షానికి చెందిన పలువురు సభ్యులు కూడా అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రతిష్టను ఇలా దెబ్బతీయకూడదు’’ అని రిజిజు శుక్రవారం అన్నారు. ‘‘ఆయన(రాహుల్ గాంధీ) చిన్నపిల్లవాడు కాదని అర్థం చేసుకోవాలి. దేశ గౌరవం, ప్రతిష్టను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతిపక్ష నాయకుడికి ఇంత అవగాహన ఉండాలి’’ అని చెప్పారు.
Also Read
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
గురువారం, భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందనే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని సమర్థించడంతో రాహుల్ గాంధీ ఒక వివాదానికి తెరలేపారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారాం తప్ప అందరికి భారత దేశ ఆర్థిక వ్యవస్థ చనిపోయిందని తెలుసని కాంగ్రెస్ ఎంపీ ఆరోపణలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. బీజేపీ దేశ ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాలను నాశనం చేసిందని, దేశాన్ని నేలమట్టం చేస్తుందని ఆరోపించారు.
అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎంపీలైన శశిథరూర్, రాజీవ్ శుక్లా, కార్తీ చిదంబరం విభేదించారు. మన ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం బలహీనంగా లేదని, ట్రంప్ భ్రమల్లో జీవిస్తున్నారని రాజీవ్ శుక్లా అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదని అందరికి తెలుసని థరూర్ చెప్పారు. ఇక్కడ చనిపోయింది భారత్ ఆర్థిక వ్యవస్థ కాదని, రాహుల్ గాంధీ విశ్వసనీయ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
-
Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
-
YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?