PM Modi: ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్కి మోడీ అదిరిపోయే కౌంటర్..
- ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్కి ప్రధాని మోడీ కౌంటర్..
- భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిబోతోందని కామెంట్స్..
- స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్ ఎకానమీ’’గా పొల్చారు. రష్యాతో భారత సంబంధాలను ఉద్దేశిస్తూ, రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థలు చనిపోయే స్థితిలో ఉన్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉందని శుక్రవారం అన్నారు. భారత ఆర్థిక ప్రయోజనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రపంచ అస్థిర వాతావరణాన్ని ప్రస్తావిస్తూ.. దేశ ప్రయోజనాలకు సేవ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ప్రతీ పనిని చేస్తోందని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినంత వరకు అప్రమత్తంగా ఉండాలని వారణాసిలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన అన్నారు. ‘‘మా ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం చేయగలిగినదంతా చేస్తోంది. దేశానికి ఉత్తమంగా ఉండాలని కోరుకునేవారు, భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడాలనుకునేవారు, అది ఏ రాజకీయ పార్టీ అయినా, తమ విభేదాలను పక్కనపెట్టి ‘స్వదేశీ’ ఉత్పత్తుల కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి’’ అని అన్నారు.
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
Read Also: Raghunandan Rao: హిందువులను టెర్రరిస్టులుగా యూపీఏ ప్రభుత్వం చూపించింది..
మనమంతా భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని, స్థానికుల కోసం మనం గొంతు కలపాలని ప్రధాని అన్నారు. జూలై 31న, భారతదేశ ఉత్పత్తులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన ఒక రోజు తర్వాత, ట్రంప్ భారత్-రష్యా సంబంధాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు దేశాలు చనిపోయిన ఆర్థిక వ్యవస్థలుగా మరింత దిగజారిపోతాయని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత ప్రధాని మోడీ నుంచి కౌంటర్గా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని చెప్పారు.
వారణాసి ర్యాలీలో, పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాద శక్తులు పాతాళలోకంలో ఉన్నప్పటికీ వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మహాదేవుడు తన రుద్ర రూపాన్ని అలంకరించాడు, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సత్తాను ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడాన్ని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. పాకిస్తాన్ బాధను సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ భరించలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!