PM Modi: ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్కి మోడీ అదిరిపోయే కౌంటర్..
- ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్కి ప్రధాని మోడీ కౌంటర్..
- భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిబోతోందని కామెంట్స్..
- స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్ ఎకానమీ’’గా పొల్చారు. రష్యాతో భారత సంబంధాలను ఉద్దేశిస్తూ, రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థలు చనిపోయే స్థితిలో ఉన్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉందని శుక్రవారం అన్నారు. భారత ఆర్థిక ప్రయోజనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రపంచ అస్థిర వాతావరణాన్ని ప్రస్తావిస్తూ.. దేశ ప్రయోజనాలకు సేవ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ప్రతీ పనిని చేస్తోందని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినంత వరకు అప్రమత్తంగా ఉండాలని వారణాసిలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన అన్నారు. ‘‘మా ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం చేయగలిగినదంతా చేస్తోంది. దేశానికి ఉత్తమంగా ఉండాలని కోరుకునేవారు, భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడాలనుకునేవారు, అది ఏ రాజకీయ పార్టీ అయినా, తమ విభేదాలను పక్కనపెట్టి ‘స్వదేశీ’ ఉత్పత్తుల కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి’’ అని అన్నారు.
Also Read
Read Also: Raghunandan Rao: హిందువులను టెర్రరిస్టులుగా యూపీఏ ప్రభుత్వం చూపించింది..
మనమంతా భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని, స్థానికుల కోసం మనం గొంతు కలపాలని ప్రధాని అన్నారు. జూలై 31న, భారతదేశ ఉత్పత్తులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన ఒక రోజు తర్వాత, ట్రంప్ భారత్-రష్యా సంబంధాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు దేశాలు చనిపోయిన ఆర్థిక వ్యవస్థలుగా మరింత దిగజారిపోతాయని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత ప్రధాని మోడీ నుంచి కౌంటర్గా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని చెప్పారు.
వారణాసి ర్యాలీలో, పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాద శక్తులు పాతాళలోకంలో ఉన్నప్పటికీ వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మహాదేవుడు తన రుద్ర రూపాన్ని అలంకరించాడు, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సత్తాను ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడాన్ని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. పాకిస్తాన్ బాధను సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ భరించలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!