ఆయన ఓడిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఓడినచోట మళ్లీ పోటీచేసే అవకాశం దక్కుతుందో లేదో తెలియదు. పక్కచూపులు చూస్తున్నారని ఆ మధ్య పెద్దఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ పెద్దల బుజ్జగింపులతో సైలెంట్. కానీ.. పరామర్శ పేరుతో మరో నాయకుడితో తాజాగా జరిగిన భేటీ కొత్త ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. తీగలాగుతున్నారా? గాలానికి తీగ తగులుతుందా అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా భేటీ? లెట్స్ వాచ్! మళ్లీ చర్చల్లోకి వచ్చిన తీగల! తీగల కృష్ణారెడ్డి.…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. పోలీసులపై పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు.. హైదరాబాద్ కూకట్పల్లిలోని తన ఇంట్లోని పలు విలువైన పత్రాలతో పాటు కొన్ని వస్తువులని ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్న ఆమె… దీనిపై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. భూమి పత్రాలతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని.. ఇది బోయిన్పల్లి పోలీసుల పనేనని ఆరోపిస్తున్న అఖిలప్రియ.. ఈ ఘటనపై కూకట్పల్లి పీఎస్లో ఫిర్యాదు ఇచ్చారు.. తాను ఇంట్లో లేని సమయంలో కొంతమంది వ్యక్తులు…
గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో మరణించారు. రాజ్ కుమార్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ శ్రీ అంజన్ కుమార్ యాదవ్. హైదరాబాద్ లో ఒక మంచి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ.కోల్పోయింది.. క్రమశిక్షణ గా, పార్టీ కోసం పని చేసిన రాజ్ కుమార్ మరణం పార్టీ కి తీరని లోటు అని తెలిపారు. ఆయన…
మరోసారి తెలంగాణను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతోంది… హైదరాబాద్లో వ్యాక్సిన్ల కోసం ప్రజలు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రెండో డోసు అయినా.. మొదటి డోసు అయినా ఏం తేడా లేదు.. తెల్లవారుజామునే వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు… అయితే, ఒక్కో పీహెచ్సీలో 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసుతున్నారు సిబ్బంది.. దీంతో.. మిగతావారు వెనుదిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి.. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు లక్ష మందికి పైగా వ్యాక్సిన్…
ఏకంగా 180 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణం చేసే వీలున్న విమానంలో.. ముగ్గురంటే ముగ్గురే.. అది కూడా ఒకే ఫ్యామిలీ ప్రయాణం చేసింది… అయితే, విమానాన్ని ఆ ఫ్యామిలీ బుక్ చేసుకుందేమో.. అందుకే ముగ్గురు మాత్రమే ప్రయాణం చేశారని అనుకుంటే మాత్రం తప్పులే కాలేసినట్టే ఎందుకుంటే.. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి లభించింది. హైదరాబాద్ టు షార్జా.. విమానంలో ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసిన వీడియో ఒకటి…
అత్యవసర బోర్డు సమావేశానికి సంబంధించి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు.. హైదరాబాద్ లోని జలసౌధలో జీఆర్ఎంబీకి చెందిన 10వ సమావేశం, కేఆర్ఎంబీకి చెందిన 13వ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు ప్రకటించాయి… కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలోని వివిధ అంశాలను అమలు చేసేందుకు ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్టు వెల్లడించాయి బోర్డులు.. తెలంగాణ రాష్ట్రం నుంచి సభ్యులు ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదని వెల్లడించిన గోదావరి, కృష్ణా నదీ…
త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పోడు భూములకు రైతుబంధు అందిస్తున్నామన్న ఆయన.. త్వరలోనే అటవీ భూములను సర్వే చేస్తామని చెప్పారు.. ఇక, ఆదివాసీల సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కొమురంభీం భవనాన్ని నిర్మిస్తామన్న సీఎం.. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఆదివాసీ గూడెంలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేశామని గుర్తుచేసిన తెలంగాణ సీఎం.. ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు మ్యూజియాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా,…
ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…
రోగి నుండి బంగారం చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లోని కె.పి.హెచ్.బి పరిధిలో జరిగింది. ఈ నెల 5వ తేదీన హృద్రోగ సమస్యలతో శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో బాధితురాలు చేరింది. వైద్యం కొరకు ఆసుపత్రికు వచ్చిన రోగి నుండి జక్కిరాముడు అనే వార్డు బాయ్ బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మెడలో ఉండాల్సిన మూడు తులాల బంగారు గొలుసు కనిపించకపోవటంతో ఆమె మనువడు…
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) స్కైట్రాక్స్ ప్రపంచ ఎయిర్ పోర్ట్స్ అవార్డులు-2021లో ‘బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా & సెంట్రల్ ఏషియా’ అవార్డును గెల్చుకుంది. హైదరాబాద్ విమానాశ్రయం స్కైట్రాక్స్ అవార్డును గెల్చుకోవడం వరుసగా ఇది మూడోసారి. అలాగే ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాలలో గత ఏడాది 71వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 64వ స్థానానికి చేరింది. హైదరాబాద్ విమానాశ్రయం ఈ క్రింది విభాగాలలో కూడా అవార్డులు గెల్చుకుంది: స్కైట్రాక్స్ కొన్ని నెలల క్రితం చాలా…