టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే.. మేం ఎప్పుడూ కలవం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే నంటూ మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఆయన చేపట్టిన పాదయాత్ర మూడు రోజుకు చేరుకుంది.. ఇక, రాత్రి బసచేసిన బాపుఘాట్ దగ్గర ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజ నుంచి మంచి స్పందన ఉందన్నారు.. మొన్న ప్రారంభమైన పాదయాత్ర నిన్న రాత్రి 2 గంటల వరకు కొనసాగిందన్న ఆయన.. యువతీ, యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు పాదయాత్రకు బాగా మద్దతిస్తున్నారు.. మంగళ హారతులు పడుతున్నారు.. పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు చెబుతున్నారని వెల్లడించారు. నిన్న పాతబస్తీలో పూల వర్షం కురిపించారు… బొట్టు పెట్టి ఆశీర్వదించారన్న ఆయన.. పాదయాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చారని తెలిపారు.. ఇక, తెలంగాణలో అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు బండి సంజయ్.. ప్రభుత్వంపై ప్రజలు బాధ, ఆవేశం, ఆవేదనలో ఉన్నారని.. నేను పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించే అడుగుతున్నారన్నారు.
ఇక, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసింది… వాటికి అదనంగా రూ.1.40 వేలు ఇచ్చిందన్నారు బండి సంజయ్.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల జాబితా ఇమ్మంటే… ఇప్పటివరకు కేసీఆర్ ఆ లిస్ట్ ఇవ్వలేదని ఆరోపించిన ఆయన.. కాంట్రాక్టర్ల కమిషన్ ల కోసమే ఇళ్లు కడుతున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ హయాంలో 70 వేల ఇళ్లు ఏడాదిలో పూర్తి చేశారని తెలిపారు.. 40 ఎకరాల స్థలంలో బోజగుట్టలో ప్రభుత్వ అధికారులు తమ ఇళ్లను ఖాళీ చేయించారని స్థానికులు చెప్పారని.. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్లి రూమ్ రెంట్ కట్టుకునే పరిస్థితిలో కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.. 100 రూమ్ ల గడీని… వందల కోట్లతో కేసీఆర్ కట్టుకున్నాడని ఫైర్ అయ్యారు.. అర్బన్ లో 8000 ఇళ్లు మాత్రమే కట్టించారు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అనేవి కేసీఆర్ తో కావన్నారు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకైనా కేసీఆర్ సహకరించాలని డిమాండ్ చేసిన బండి సంజయ్. రూ. 3500 కోట్లను కేంద్రం మంజూరు చేసింది… 2500 కోట్లను ఇప్పటికే విడుదల చేసిందన్న ఆయన.. తెలంగాణకు అదనంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత మాదేనన్నారు. 2.03 లక్షల వేల ఇళ్లను వెంటనే కట్టించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఉప ఎన్నిక వస్తేనే… కేసీఆర్ బయటికి వస్తాడని ఆరోపించిన సంజయ్.. నా పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకునే అవకాశం లభించిందని.. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ సమస్యలనే చెప్పుకుంటున్నారన్నారు.. నా విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తే… ప్రజలు తిప్పికొడతారు.. తిరగబడతారని హెచ్చరించారు. పాతబస్తీలో ఎంఐఎం గుండాల చేతిలో నలిగిపోయిన హిందువులకు అండగా ఉండడం కోసమే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించినట్టు వెల్లడించిన సంజయ్.. పాతబస్తీని వదిలిన హిందువులు మళ్లీ తిరిగి వచ్చేలా చేస్తాం అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటేనని.. టీఆర్ఎస్తో కలిసి బీజేపీ ఎప్పుడూ పోటీచేయలేదన్నారు.
Also Read
- Tags
- bandi sanjay
- bjp
- cm kcr
- hyderabad
- MIM
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!