హైదరాబాద్ లో ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అని ఎన్టీవీతో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న అన్నారు. రాష్ట్రంలో రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని తెలిపారు. కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు…
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేసారు. అయితే హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నేడు ఆ ఏర్పాట్లను పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయిల్ రన్ నిర్వహించారు అధికారులు. అనంతరం సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక మైన ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టం ని వాడుతున్నాం. అలాగే ట్యాంక్ బండ్ పై ఈ సారి క్రేన్ల…
విరసం నేత, ప్రముఖ కవి వరవరరావు బెయిల్ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు.. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ఎల్గార్ పరిషద్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో వున్న వరవరరావుకు…
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. ఇవాళ్టి నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. నేటి నుంచి రాత్రి వేళల్లో 10 గంటల 15 నిమిషాలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. ఇక మెట్రో తీసుకున్న తాజా నిర్ణయం తో ప్రయాణికులకు…
ఉప్పల్ లో ఘరానా మోసాలకు పాల్పడ్డాడు ఓ పాస్టర్. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన ఆ కీచక పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే…. ఉప్పల్ లోని గాస్పల్ చర్చి కు పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు… కొన్ని టీవీ ఛానళ్లలో మత ప్రభోధకుడు గా పని చేస్తూ అమాయక ఆడపిల్లను టార్గెట్ చేశాడు. చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగదీసుకొని మోసం చేస్తున్నాడు పాస్టర్ జోసఫ్.…
మన ఇండియా లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న VTIXK ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేసారు. అయితే విమానంలోని బాత్ రూమ్ లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఆధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసారు. అనంతరం… హూటా హూటీన సిఐఎస్ఎఫ్ ఆధికారులను రప్పించి తనిఖీ చేయడంతో విమానంలోని బాత్ రూమ్ లో అక్రమ బంగారం లభ్యం…
కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది.. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు.. దీంతో ఎవరికి తోచినట్టు వారు చేసేస్తుంటారు.. అయితే, కాంగ్రెస్ పార్టీలో తాజా పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పార్టీలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి ముగ్గురు ముఖ్యమేనని మీడియా చిట్చాట్లో అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి, పీసీసీ కొత్త కమిటీకి గ్యాప్ ఉందని.. కాకపోతే అందరం కలిసి పని చేయాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. ఇక,…
టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల్ని చీట్ చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.. మహిళా సాధికారతకి కాంగ్రెస్ పెద్ద పీటవేసిందని.. కానీ, టీఆర్ఎస్ మహిళల్ని చీట్ చేస్తోంది.. ఒక్కో మహిళకు ఐదు నుండి 10 వేలు బాకీ ఉన్నారన్నారు. కాంగ్రెస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని గుర్తుచేసిన ఉత్తమ్.. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక… వడ్డీ…
గత కొన్నిరోజులుగా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్ష బీభత్సవానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది… ఈ నేపథ్యంలో.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.. రాగల 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని పేర్కొంది.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ…