సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి చెందడం హైదరాబాద్లో విషాదం నింపింది. కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్లో ఈ ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ లో దిగారు నలుగురు కార్మికులు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ శ్రీను, ఆంజనేయులు అనే ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గౌతమి ఎన్క్లేవ్లోని అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు తొలుత ఇద్దరు కూలీలు దిగారు. కాసేపటికి వారికి ఊపిరాడక అందులోనే చనిపోయారు. విషవాయువులు వెలువడటంతో చనిపోగా ..ఇది గమనించి…
మద్యం మత్తులో కన్నకొడుకు ఫై దాడి చేశాడో తండ్రి. కనికరం లేకుండా కొడుకుని చావబాదాడు. పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా . అంటూ ఓ పసి బాలుడు బ్రతిమిలాడుతూ మంచం కిందికి వెళ్లి దాక్కున్నా, తలగడ అడ్డం పెట్టుకున్నా, కూతురు వద్దు పప్పా అని ప్రాధేయపడుతున్నా కనికరించలేదు. ఆ కర్కోటక కన్న తండ్రికి హృదయం చలించలేదు. రెండున్నర నిమిషాలు ఆగకుండా చేతిలోని కట్టె విరిగేలా ఒళ్లంతా హూనం చేసిన హృదయవిదారక ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్స్టేషన్పరిధిలో చోటు…
‘సిరివెన్నెల’ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని.. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్, డూపర్ హిట్ సాంగ్స్ అందించిన ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సీతారామశాస్త్రిని వెంటనే కుటుంబసభ్యులు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.. ఆయనకు కిమ్స్లో చికిత్స కొనసాగుతోంది.. మరోవైపు.. సిరివెన్నెల తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి.. ఆ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు.. న్యుమోనియా తోనే హాస్పిటల్లో…
దేశ ఆరోగ్య సూచిల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలంటూ కీలక సూచనలు చేశారు మంత్రి హరీష్రావు.. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వైద్య రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సూచిల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించాలన్నారు. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు పూనుకోవాలని ఆదేశించారు హరీష్రావు.. ఇక, విభాగాల వారీగా అధికారులు వారి…
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎస్ అధికారి పేరుతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… మ్యాట్రీమోనీలో హరిప్రసాద్ అనే యువకుడు ఐపీఎస్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఐపీఎస్ అధికారి అని ప్రొఫైల్ కనిపించడంతో ఆసక్తి కనపరిచిన మహిళలను హరిప్రసాద్ ట్రాప్ చేయడం ప్రారంభించాడు. అయితే ఓ మహిళకు అనుమానం వచ్చి ఐడీ కార్డు చూపించమని అడిగింది. దీంతో హరిప్రసాద్…
హైదరాబాద్ మియాపూర్లో యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బ్రహ్మానందం (22) మిస్సింగ్ మిస్టరీగా మారింది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం బయటకు వెళ్లి తమ కుమారుడు తిరిగిరాలేదని తల్లిదండ్రులు నరసింహారావు, నాగలక్ష్మీ దంపతులు ఆరోపిస్తున్నారు. 2019 జూలై 3న ఆఫీసుకు వెళ్లి అదృశ్యమయ్యాడని… అప్పటి నుంచి ఇంటికి రాలేదని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీసులో మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డు అయిందని… ఆ తర్వాత బ్రహ్మానందం ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని.. దీంతో పోలీసుల…
దేశ వ్యాప్తంగా నిర్భయ ఘటన తరువాత అంతటి సంచలనాన్ని రేకెత్తించిన ఘటన దిశ హత్య. అర్ధరాత్రి ఒక డాక్టర్ ని నలుగురు వ్యక్తులు అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన జరిగి నేటికీ రెండేళ్లు అవుతుంది. ఈ హత్య కేసులో పోలీస్ వారు తీసుకున్న నిర్ణయం ఎంతటి సంచలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. నిందితులందరిని ఎన్ కౌంటర్ చేసి పడేశారు. ఆ ఘటన ఇప్పుడు తలచుకున్నా వెన్నులో వణుకుపుట్టక మానదు. అసలు ఆరోజు ఏం జరిగిందో…
కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది.. ఇప్పట్లో థర్డ్ వేవ్ ముప్పుకూడా పెద్దగా ఉండకపోవచ్చు అనే అంచనాలు వేశారు.. కానీ, కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు వెలుగుచూస్తున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. అప్రమత్తమైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, సింగపూర్లు సదరన్ఆఫ్రికా దేశాలపై ట్రావెల్బ్యాన్విధించాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం…
లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఏకంగా తన వలలో పడ్డ వారికి అంతా కలిపి 200 200 కోట్ల కుచ్చు టోపీ పెట్టిందట. తాజాగా హైదరాబాద్ లో పోలీసులు శిల్ప అనే వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి కోట్లకు కోట్లు వసూలు చేసిందట. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ దగ్గర్నుంచి డబ్బులను తీసుకొని మోసం తీసుకొని, అందరికీ నామాలు పెట్టేసింది. అయితే ఈ లిస్ట్ లో ముగ్గురు…
కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం ఆన్లైన్కే పరిమితం అయ్యింది.. అయితే, సెకండ్ వేవ్ తర్వాత కాస్త సాధారణ పరిస్థితులు నెలకొనడంతో… క్రమంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.. ఇదే సమయంలో.. అక్కడక్కడ కోవిడ్ కేసులు వెలుగు చూస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. తాజాగా, దుండిగల్ బహదూర్పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది… పలువురు విద్యార్థులకు కరోనా సోకడంతో సెలవు ప్రకటించారు యూనివర్సిటీ నిర్వాహకులు.. రేపటి నుంచి సానిటైజ్ చేసి తరగతులు నిర్వహిస్తామని…