హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎల్ఈడీ దీపాల వెలుగులో వెలిగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న భద్రత చర్యల కారణంగా ఔటర్ రింగు రోడ్డు కొత్త రూపు సంతరించుకుంది. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.100.22 కోట్లతో ఏడేళ్ల వరకు ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపులున్న సర్వీస్ రోడ్లపై కిలోమీటర్ దూరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు…
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత…
నామినేటెడ్ పదవుల కోసం చాలా కాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు.. అయితే, అందులో కొంతమందికి శుభవార్త చెప్పారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు.. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నగేష్. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా పాటిమీది జగన్ మోహన్ రావు.…
పసిడి ప్రేమికులకు భారీగా పెరిగిన ధరలు షాకిస్తున్నాయి.. ఈ మధ్య క్రమంగా పైకి కదులుతోన్న బంగారం ధర.. నిన్న గుడ్న్యూస్ చెబుతూ కిందికి దిగివచ్చింది.. కానీ, మరోసారి పైకి కదిలి మళ్లీ షాకిచ్చింది.. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు పెరుగుదల, దేశీ మార్కెట్లో డిమాండ్తో పసిడి ధర పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. Read Also: సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల…
తెలంగాణలో చలి విపరీతంగా పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావం వల్ల చలి తీవ్రస్థాయిలో పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి బలమైన చలిగాలులు వీయనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈనెల 18 నుంచి 20 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 10 డిగ్రీల వరకు నమోదు కావచ్చని సూచించారు. Read Also: ఇంటర్ విద్యార్థి సంచలన ట్వీట్.. నా సూసైడ్కు కారణం…
‘పుష్ప’ సినిమాపై రోజురోజుకు అంచనాలు ఎక్కైవైపోతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ విశ్వరూపం చూద్దామా అని అభిమానులు కాచుకు కూర్చున్నారు. అందులోను ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో సుకుమార్ ని బన్నీ ఆకాశానికెత్తేశాడు.. సుకుమార్ దగ్గరకి వచ్చి ప్రతి దర్శకుడు నేర్చుకోవాలని చెప్పడంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు రెట్టింపవుతున్నాయి. సుకుమార్ గురించి బన్నీ మాట్లాడుతూ” సుకుమార్ గురించి ఒక ప్రేక్షకుడిగా మారి చెప్తున్నాను.. ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా చెప్పొచ్చా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పుష్ప టీమ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. మీడియాతో మమేకమయిన పుష్ప టీమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పుష్ప పాన్ ఇండియా మూవీగా ఎలా మారిందో దర్శకుడు సుకుమార్ తెలిపారు. ” నేను ఈ సినిమాను తెలుగు సినిమాలాగే…
పుష్ప.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. సుకుమార్- అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొన్నారు అభిమానులు.. ఇక రేపే విడుదల కావడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్.. గత మూడు రోజులుగా అన్ని భాషలను కవర్ చేసుకొంటూ వచ్చిన బన్నీ ఇక చివరగా తెలుగు మీడియా ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. తాజాగా హైదరాబాద్ లో…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్లో ఎంటరైంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలినట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్గా తేలడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించడం.. వారికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఎంట్రీతో అప్రమత్తం అయ్యారు అధికారులు.. ఇక, ఆ ఇద్దరూ మొహిదీపట్నం టోలీచౌకీ ప్రాంత వాసులే కావడంతో.. ఆ…
ఎంత జాగ్రత్తగా ఉన్న రోజుకో పద్ధతితో మోసాలకు పాల్పడే వారు అదే పనిగా తమ చేతి వాటం చూపిస్తున్నారు.. ఇటీవల కాలంలో ఈ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సీటీలో నకిలీ సెంకడ్ ఛానల్ బ్యాంకు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతోఈ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెకెండ్ ఛానల్ ముసుగులో పలువురు వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకుని, బాధితులకు మంచి ట్రేడ్ ప్రాఫిట్…