గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వీడియోల్లో ఒక వర్గాన్ని దూషించినట్టు తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. అయితే, ఆ విమర్శలు కేవలం ప్రత్యర్థులు, ఇతర మతాల వాళ్లు మాత్రమే చేయలేదు. స్వయంగా ఆయన పార్టీ అధిష్టానం కూడా ఆ వీడియోలను సీరియస్గానే తీసుకుంది. అప్పుడప్పుడే నూపుర్ శర్మ వివాదం నుంచి తేరుకుంటున్న బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్ వ్యవహారం మరో తలనొప్పిగా మారకూడదని నిర్ణయించుకుంది. అందుకే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వివరణ అడిగింది. Read Also: Off The…
Largest Screen of the Country: సినిమా అభిమానుల టేస్ట్ కాలానుగుణంగా మారుతోనే ఉంది. రోజు రోజుకు థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతోంది. ఇందుకు ఓటీటీల రాక ఒక కారణమైతే థియేటర్లలో టికెట్ రేట్ల పెంపు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అంతంత ఖర్చు పెట్టి డొక్కు స్క్రీన్లపై సినిమాలు చూడడం ఎందుకు కొన్ని రోజులైతే ఓటీటీల్లోకి వస్తుందన్న మైండ్ సెట్ కు వచ్చారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే భారీగా మెట్రో నగరాల్లోని సింగిల్ స్క్రీన్…
అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క స్నాతకోత్సవ వేడుకలు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు.. అరోరాస్ కాలేజీ స్నాతక్ 2022 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ప్రెసిడెంట్ కరుణ గోపాల్, సీ.ఆర్. రావుస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వెంకటరామన్, అరోరాస్ కళాశాల చైర్మన్…
The cities with the most CCTV surveillance in the world.. 4 Indian cities in the top 10: ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయిన జనాలు సురక్షితంగా ఉండాలంటే భద్రత, రక్షణ అనేది చాలా ముఖ్యం. నేరాల అదుపు, క్రైమ్ రేట్ తక్కువగా ఉండటం ఆయా ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. శాంతిభద్రతలు సరిగ్గా ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో భద్రతకు చాలా ప్రాముఖ్యత ఉంది.…
ఆస్తికోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. డబ్బు ఉంటే చాలు కుటుంబాన్ని కడతేర్చడానికి కూడా వెనకడాటం లేదు. తండ్రి ఆస్థి కోసం ఓ కొడుకు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం తండ్రినే కడతేర్చిన ఘటన తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ నిందితులు దొరికిపోయిన కేసులో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఈ కేసులో, ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్ ఇప్పటికే హల్ చల్ చేస్తోంది.. దేశంలోని అన్ని కోర్టులకు, వ్యవస్థలకు, పార్టీలకు, ప్రముఖులకు సైతం.. ఆ వివరాలను పంపించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. మరోవైపు.. ఈ కేసును పూర్తిస్థాయిలో తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేశారు.. హైదరాబాద్ పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్…
తెలంగాణలో బీజేపీకి ఉన్నది 5 శాతం ఓటింగ్ మాత్రమే… రాష్ట్రంలో టీఆర్ఎస్కి అసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పార్టీలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు.. మర్రి శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పార్టీ మీద ఆయన చేసిన కామెంట్స్ క్షమించలేనివి.. కానీ, మర్రి శశిధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చే పరిధి ఏఐసీసీది అన్నారు.. బయటకు వెళ్లివాళ్లను…