మహిళా ప్రయాణికులకు తెలంగాణ స్టేట్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీ.ఎస్.ఆర్టీసి ఏర్పాటు చేసింది. 127K నంబర్ బస్సు మహిళల కోసం ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. లేడీస్ స్పెషల్ బస్సు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా చెప్పారు.
ఇందిరాపార్క్ దగ్గర సెకండ్ ఎఎన్ఎమ్ ల ధర్నాకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ధర్నాను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ ఎఎన్ఎమ్ లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు..
నేను మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళిధర్ రావు అన్నారు. కేసీఆర్ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు.. కుమార స్వామినీ వదిలేశాడు.. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ను కొట్టలేరు అని ఆయన పేర్కొన్నాడు.
మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలో సమస్యలపై స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూముకుంట, శామీర్ పేట, ప్రాంతాల్లో గ్రంథాలయ భవన నిర్మాణాల శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఫైర్ అయ్యారు.
సరిసాటిలేని సౌందర్యానికి కూడా కొత్త అందాలు తెచ్చే 'ఇల్బుమినా' అనే ఒక అపూర్వమైన విభాగానికి తెలంగాణా రాష్ట్ర పోలీస్ శాఖ, మహిళా భద్రతా విభాగం డిఐజి - శ్రీమతి సుమతి బడుగుల - ఈనాడే హైదరాబాద్లోని నానక్ రామ్ గూడా స్టార్ హాస్పిటల్స్ లో శుభారంభం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్- సెక్రటేరియట్ సూచనలకు అనుగుణంగా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి స్వీకరించడం) బిల్లు-2023తో సహా రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి అందిన అన్ని బిల్లులు చట్ట కార్యదర్శికి సిఫార్సు చేయబడ్డాయి.
హైదరాబాద్ నగర శివారులోని శంకర్ పల్లి మండలం మోకిల గ్రామంలో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మోకిల లేఅవుట్ ప్లాట్లకు మస్తు డిమాండ్ నెలకొంది.