ఈ సంవత్సరం వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. ఈనెల 19వ తారీఖున సాంప్రదాయబద్దంగా గణేష్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపింది.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత కనిపించగా.. సాయత్రం నుంచి వాతావరణంలో మార్పు కనిపించింది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, బేగంపేట్, తార్నాక, ఉప్పల్, హిమాయత్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
SI Rajender: డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై నిఘా ఉంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు నిందితులను అరెస్టు చేశారు.
శ్రావణ మాసంలో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు ఫుల్ రద్దీగా మారాయి. అయితే, బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట దొరికింది.
ఆంజనేయులు తప్పిపోయి 6 రోజులు అవుతున్నా.. పేరెంట్స్ కి సమాచారం చేయని కాలేజ్ యాజమాన్యం.. 6 రోజులుగా తమ కొడుకు ఫోన్ చేయడం లేదని.. తొటి విద్యార్థులకు ఫోన్ చేసిన పేరెంట్స్.. మీ అబ్బాయి మిస్ అయ్యాడు అని చెప్పిన ఆంజనేయులు ఫ్రెండ్స్.. దీంతో కంగారుగా కాలేజ్ కి చేరుకున్న పేరెంట్స్, బంధువులు.. కాలేజ్ ఎదుట ఆందోళన చేశారు.
ఈ రోజు ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ జన్మదిన వేడుకలు సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో హాట్టహసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఇండో బ్రిటీష్ పెయిన్ క్లినిక్ లోగో మరియు వీడియో లంచ్ డాక్టర్ విజయ భాస్కర్ బండికట్ల ఆధ్వర్వంలో సుమన్ తల్వార్ చేతుల మీదుగా జరుపుకోవడం జరిగింది.
Musheerabad PS: మనలో చాలామంది కాస్లీ వస్తువులు, బంగారం ధరించడానికి ఇష్టపడతారు. అవి ఒక్కోసారి దొంగతనాలకు గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు.
Cheetah in LB Nagar: చిరుతలు ఎక్కడో అడవిలో ఉన్నాయని అనుకుంటాం కానీ.. ఇప్పుడు ఆ చిరుతలు పట్నంలోనూ దర్శనమిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలం పరిధిలోని మోకిల గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ఫ్లాట్లతో మోకిలలో రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందించింది. అయితే, హెచ్ఎండీఏ లేఅవుట్ లో ప్లాట్ల కొనుగోలుకు రెండవ రోజు (గురువారం) అదే జోరు కొనసాగింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.