Student Missing: మా పిల్లాడికి ఏం జరిగినా కాలేజ్ యాజమాన్యం దే బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అబ్దుల్లాపూర్ మేట్ బ్రిల్లియంట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతుంది. డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆంజనేయులు గత ఆరు రోజులుగా కనిపించడం లేదంటూ తొటి విద్యార్థులు, స్టూడెంట్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆంజనేయులు మిస్సింగ్ కి కాలేజ్ యాజమాన్యమే కారణం అంటూ స్టూడెంట్స్, విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. కాలేజ్ లోపలికి చొచ్చుకెల్లి కొందరు విద్యార్థులు అద్దాలు ధ్వంసం చేశారు. హాస్టల్ క్యాంపస్ లో సీసీ కెమెరాలు ఎక్కడా పనిచేయలేదు.
Read Also: Chandrayaan-3: శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు.. వీడియోను షేర్ చేసిన ఇస్రో
Also Read
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
ఆంజనేయులు తప్పిపోయి 6 రోజులు అవుతున్నా.. పేరెంట్స్ కి సమాచారం చేయని కాలేజ్ యాజమాన్యం.. 6 రోజులుగా తమ కొడుకు ఫోన్ చేయడం లేదని.. తొటి విద్యార్థులకు ఫోన్ చేసిన పేరెంట్స్.. మీ అబ్బాయి మిస్ అయ్యాడు అని చెప్పిన ఆంజనేయులు ఫ్రెండ్స్.. దీంతో కంగారుగా కాలేజ్ కి చేరుకున్న పేరెంట్స్, బంధువులు.. కాలేజ్ ఎదుట ఆందోళన చేశారు. కాలేజ్ యాజమాన్యం, వార్డెన్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Viral Video: నుదుట కుంకుమ పెట్టుకుని మెట్రో స్టేషన్కు.. అందరి చూపు అతని వైపే..!
దీంతో కాలేజ్ కి సెలవు ప్రకటించి యాజమాన్యం వెళ్లిపోయింది. దీంతో కాలేజ్ దగ్గర ఆంజనేయులు తల్లి మాట్లాడుతూ.. మాకు నిత్యం ఫోన్ చేసే మా అబ్బాయి.. మూడు రోజులుగా ఫోన్ చేయకపోవడంతో భయపడ్డాం.. కాల్ చేస్తే ఫోన్ పనిచేయలేదు.. ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాం.. మీ అబ్బాయి తప్పిపోయాడు.. మేమంతా వెతుకుతున్నాం.. మీకు ఇంకా తెలియదా అన్నారు.. మేము కాలేజ్ కి వచ్చి అడిగితే.. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేశాం.. సీఐ కాల్ చేస్తే కానీ వార్డెన్ కాలేజ్ కి రాలేదు అని ఆమె పేర్కొన్నారు.
Read Also: Anushka Shetty: మిస్టర్ పోలిశెట్టి ఇంతలా తిరుగుతున్నా మిస్ శెట్టి అందుకే మిస్సింగ్?
కాలేజీలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అని ఆంజనేయులు తల్లి అన్నారు. యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు.. మా అబ్బాయి మాకు క్షేమంగా దొరికితే చాలు.. ఈ కాలేజ్ వద్దు.. వీడి బిల్డింగులు వద్దు.. అప్పు చేసి.. మా జీవితం తాకట్టు పెట్టి మా పిల్లాడిని ఈ కాలేజ్ లో చేర్పించాం.. మూడు రోజులుగా బయట బస్టాండ్ లో పడుకుంటున్నాం.. మా పిల్లాడు రాకపోడా అని హాస్టల్ వద్ద వచ్చి ఎదురు చూస్తున్నాం.. మా పిల్లాడికి ఏం జరిగినా కాలేజ్ యాజమాన్యం దే బాధ్యత అని ఆంజనేయులు కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?