హైదర్ గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న వై జంక్షన్ దగ్గర రన్నింగ్ లో ఉన్న ఆటోపై చెట్టుకూలి డ్రైవర్ స్పాట్ లోనే మరణించాడు. ఈ సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహమ్మద్ గౌస్ పాషా రాజ్ భవన్ రోడ్డు లోని ఎమ్మెస్ మక్తా వాసిగా గుర్తించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశాడు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ తమాషాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైందని రాజాసింగ్ ఆరోపించారు. అర్హులను కాదని, అనర్హులు, బీఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తున్నారని ఆయన అన్నారు.
Madhapur Drugs Case: నగరంలోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు బృందాలు మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలను కనుగొన్నాయి. మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ బృందం దాడులు చేసింది.
Rave Party: టాలీవుడ్లో డ్రగ్స్ గుట్టు మరోమారు బట్టబయలైంది. హైదరాబాద్ మాదాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్లో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.
వికాస్ రావు డాక్టర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అని బండి సంజయ్ అన్నారు. మంచి ఆలోచనతో, బీజేపీపై నమ్మకంతో చేరుతున్నందుకు ధన్యవాదాలు.. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జండా ఎగరడం ఖాయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు.
Sportstar Sports Conclave in Telangana State on August 31: భారతీయ క్రీడా పత్రిక ‘స్పోర్ట్స్టార్’ దేశవ్యాప్తంగా ప్రాంతీయ క్రీడా సమ్మేళనాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. భారతదేశంలో క్రీడా విప్లవాన్ని వేగవంతం చేయడానికి ప్రతి రాష్ట్రంలోని క్రీడలకు సంబందించిన వ్యక్తులతో ‘స్పోర్ట్స్ కాన్క్లేవ్’ నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం మరియు కార్పొరేట్ సంస్థలు ఎలా ఉపయోగపడాలో అనే సూచనలు ఇస్తారు. ఈ క్రమంలో ‘స్పోర్ట్స్ కాన్క్లేవ్’ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరగనుంది. స్పోర్ట్స్టార్…
Rajendra Nagar: నగరంలోని రాజేంద్రనగర్లో రాహుల్ సింగ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Fake Baba: పాతబస్తీలో చికిత్స నెపంతో నవ వధువుపై కపట బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని తలాబ్ కట్టా నివాసి హాజీతో మూడు నెలల క్రితం వివాహమైంది.
దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నిన్న (సోమవారం) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. అయితే ఈ నాణేన్ని దక్కించుకోవడం కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీగా పోటీపడుతున్నారు.