Telangana Rains: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain in Telangana State: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించింది.
ఆదివారం నుంచి నిజామాబాద్లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దాంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్, బోధన్ రోడ్డులోని మాలపల్లి రహదారులు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నిజామాబాద్లోని పూలాంగ్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో జిల్లాలోని పలు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
Also Read
జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో కాల్వలు నిండి రోడ్లపైకి మురుగునీరు చేరడంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీగా వర్షం కురిసింది. సంగారెడ్డిలో వర్షం కురవడంతో ప్రధాన మార్గంలో రోడ్లపైకి వరదనీరు చేరింది. జోగులాంబ గద్వాల జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వరదనీరు కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read: Jasprit Bumrah: తండ్రైన జస్ప్రీత్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు!
హైదరాబాద్లోని కూకట్పల్లి, హైదర్నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, మియాపూర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అమీర్పేట్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, మెహదీపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో స్కూల్స్, ఆఫీసులకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల వర్షం కురుస్తూనే ఉంది. మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!