Hyderabad family suicide: చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా?
- విగతజీవులుగా పడి ఉన్న అనిల్, కవిత
- రెండేళ్ల చిన్నారి, తల్లి వెంకటమ్మ, తండ్రి లక్ష్మయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad family suicide: హైదరాబాద్ మియాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఫుడ్ పాయిజన్ కారణమా? అనేది తెలియాల్సి ఉంది. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్.. ఉపాధి కోసం ఫ్యామిలీతో హైదరాబాద్కు వచ్చాడు. అజీజ్నగర్లో నివాసం ఉంటూ మేస్త్రీ పని చేస్తూ ఉండే వాడు. కవితను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి రెండేళ్ల చిన్నారి కూతురు ఉంది. ఇక అనిల్.. అత్త, మామ కూడా వారితోనే ఉంటున్నారు. మియాపూర్లోని మక్త మహబూబ్పేటలో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాత్రి వరకు నవ్వుతూ మాట్లాడిన నలుగురు.. తెల్లవారేసరికి చిన్నారితో సహా గదిలో విగతజీవులుగా పడి ఉన్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
పక్కింటి వాళ్లు తలుపు ఎన్ని సార్లు కొట్టినా తీయలేదు
గురువారం ఉదయం అనిల్.. మామ లక్ష్మయ్యకు బంధువులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో పక్కనే ఉన్న వాళ్లకు సమాచారం ఇచ్చారు. పక్కింటి వాళ్లు వచ్చి తలుపు ఎన్ని సార్లు కొట్టినా తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోపల చూడగా అనిల్, కవితతో పాటు రెండేళ్ల చిన్నారి కవిత తల్లి వెంకటమ్మ, తండ్రి లక్ష్మయ్య విగతజీవులుగా పడి ఉన్నారు. అప్పటికే వారంతా చనిపోయినట్లు అనుమానించి వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూసేసరికే నలుగురు వాంతులు చేసుకున్నట్లుగా గదిలో కనిపించింది.. అనిల్కు ఆత్మహత్య చేసుకునే అంత అవసరం లేదని బంధువులు చెబుతున్నారు. అప్పులు ఉన్న మాట వాస్తవమే కానీ చనిపోయేంత అప్పులు లేవంటున్నారు. వారు అలా ఎలా చనిపోయారో అర్ధం కావడం లేదంటున్నారు.
కేసులో కీలకంగా మారిన పోస్టు మార్టం రిపోర్ట్
పోలీసులు.. ఐదుగురి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఫుడ్ పాయిజన్తో చనిపోయారా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది. ఒకవేళ ఫుడ్ పాయిజన్ ఐతే.. రెండేళ్ల చిన్నారి ఎంత తింటుంది? ఫుడ్ పాయిజన్ అయ్యేంత ఆహారం తీసుకుంటుందా? లేక చిన్నారిని చంపి నలుగురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు చాలా కీలకంగా మారింది.
Read Also: shocking crime: ఉల్లి తెచ్చిన లొల్లి.. తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
తాజావార్తలు
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!