Medak: ముగ్గురు దోస్తుల మాస్టర్ ప్లాన్.. యూట్యూబ్లో చూసి ఏటీఎంల చోరీలు.. కట్చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak ATM Robbery Attempt: ముగ్గురు దోస్తుల మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఈజీ మనీకి అలవాటు పడి బ్యాంకులు, ఏటీఎంలను లక్ష్యంగా చోరీలు చేశారు ముగ్గురు ఆప్తమిత్రులు.. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారు. నిందితులు ముగ్గురు కూడా 28 ఏళ్ల లోపు యువకులే. గుమ్మడిదలలో HDFC ATM, వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, మెదక్లో SBI ATMలలో చోరీకి యత్నించారు. ఏటీఎం మెషిన్లను ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు కేటుగాళ్ళు. కొన్ని సార్లు వైన్స్లలో మద్యం బాటిళ్లు సైతం చోరీ చేసి అమ్ముకున్నట్టు పోలీసులు గుర్తించారు.
READ MORE: Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు..
Also Read
ఈ నిందితులను మెదక్ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(24), లింగం(28), ప్రసాద్(20)లుగా పోలీసుల గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి తాగడానికి దాచుకున్న మద్యం బాటిళ్లు, చోరీకి ఉపయోగించే తాడు, సుత్తి, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు ఎస్పీ శ్రీనివాసరావు.. నిందితులు ముగ్గురూ స్నేహితులేనని.. ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలావాటు పడ్డట్టు చెప్పారు. “యూట్యూబ్లో వీడియోలు చూసి బ్యాంకులు, ఏటీఎంలలో దొంగతనాలు చేశారు. పులువురు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశాం. సీసీటీవీ ఫుటేజీలు, పలు ఆధారాల సాయంతో నిందితులు మానేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించాం. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లగా శివారులో వీళ్లు కనిపించారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం.” అని ఎస్పీ వెల్లడించారు.
READ MORE: Monsoon Diet: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి…
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..