Hyderabad ATM Theft: నైస్గా స్కెచ్చేశాడు.. స్మార్ట్గా రూ.60 లక్షలు దోచేశాడు.. కట్చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad ATM Theft: నైస్గా స్కెచ్చేశాడు.. స్మార్ట్గా దోచేశాడు.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు.. చోరీ చేసిన సొమ్ముతో షాపింగ్లు, జల్సాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా కంత్రీగాడు..!! ఏం చోరీ చేశాడో తెలుసుకుందాం.. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో పట్టపగలే ఏటీఎంలలో క్యాష్ నింపే వాహనాన్ని అందులో పని చేస్తున్న డ్రైవరే ఎత్తుకెళ్లాడు. ఈ దోపిడీ కేసు ఒక్కసారిగా సిటీలో సంచలనంగా మారింది. ఏటీఎంలలో నగదు నింపేందుకు తీసుకెళ్తున్న క్యాష్ వ్యాన్లో దాదాపు రూ.60 లక్షల నగదు ఉన్నట్లుగా మేనేజ్మెంట్ చెబుతోంది.. ఏటీఎం చోరీ కేసులో నగదును ఎత్తుకెళ్లిన డ్రైవర్ అజీత్ అలియాస్ శివ గత 10 రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు..
Also Read
- Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
నగదు రవాణా చేసే CMS కంపెనీలో డ్రైవర్గా ఆరు నెలల క్రితం అజీత్ ఉద్యోగంలో చేరాడు. గోపన్పల్లి పరిధిలోని ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు కోటి రూపాయలకుపైగా నగదుతో డ్రైవర్ అజీత్తో పాటు మరో నలుగురు సిబ్బంది క్యాష్ వ్యాన్లో బయలుదేరారు. గచ్చిబౌలి ప్రాంతానికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని ఆపి సెక్యూరిటీ సిబ్బంది, క్యాషియర్లు మూత్ర విసర్జన కోసం వెళ్లిన సమయంలో డ్రైవర్ అజీత్ ఒంటరిగా వాహనం దగ్గరకు వచ్చి క్యాష్తో ఉన్న వ్యాన్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే CMS సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. దొంగిలించిన వాహనాన్ని అజీత్ తెల్లాపూర్ సమీపంలో వదిలి, నగదు ఉన్న ట్రంకు పెట్టతో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడు నేరుగా ముంబైకి వెళ్లి కొన్ని రోజులు షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది.
READ MORE: Dum Biryani: హోటల్ రుచితో చికెన్ దమ్ బిర్యానీ.. ఈజీగా కేవలం ఒక గంటలోనే ఇలా చేసేయండి!
ఆ తర్వాత బెంగళూరుకు చేరుకుని అక్కడి మాల్స్లో కూడా కొనుగోళ్లు చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడి కదలికలను గుర్తించేందుకు ఇప్పటివరకు వందకు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ గాలింపు చర్యలు చేపట్టారు. అజీత్ను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ముందుగానే పథకం వేసుకుని CMS కంపెనీలో ఉద్యోగంలో చేరి ఈ దోపిడీకి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడికి మరెవరైనా సహకరించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు..
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: 2027 వరల్డ్కప్లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ
-
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికెనా?
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?