ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్కు లేదు.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. హుజురాబాద్లో దళిత బంధు నిలుపుదలకు కేసీఆరే కారణం అన్నారు.. రెండు నెలలలోపు హుజురాబాద్ లో అందరికి “దళిత బంధు” ఇస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దళిత బంధును బీజేపీ ఆపిందని నిందలు వేస్తున్నారని విమర్శించారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదల్లో నష్టపోయిన వారికి…
తెలంగాణ భవన్ లో కాసేపటి క్రితమే టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గసమావేశం ముగిసింది. ఈ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగగా.. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామని.. ఈ నెల 27 హుజురాబాద్ లో ప్రచార సభకు తాను వస్తానని ప్రకటించారు. అలాగే… ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ ఉండాలని… మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలన్నారు.…
హుజూరాబాద్లో గెలవటం ఎలా? ఏం చేస్తే గెలుస్తాం? ఒకటి డబ్బు ..రెండు హామీలు. కుల సమీకరణలు ఎలాగూ ఉంటాయి. కానీ వాటికి కూడా ఈ రెండే అవసరం. అధికార పార్టీ ఈరెండింటినే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. జోరుగా హామీల వర్షం కురిపిస్తోంది. గులాబీ పార్టీ వారు ఓటుకు పది వేలు ఇస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీజేపీ కూడా బాగానే ముట్టచెపుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన బై…
హుజురాబాద్లో అట్టహాస ప్రచారానికి EC ఆంక్షలు అడ్డంకిగా మారాయి. దీంతో పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. హుజురాబాద్లో కాలు పెట్టకుండానే ఆ ప్రభావం ఉపఎన్నికపై పడేలా వ్యూహ రచనలో పడ్డాయట. వరస మీటింగ్లతో బైఎలక్షన్లో ఊపు తీసుకొచ్చే పనిలో ఉన్నాయట. ఈ విషయంలో అధికారపార్టీ ఆలోచన ఏంటి? హుజురాబాద్లో ప్రచార ఊపు తీసుకొచ్చేలా టీఆర్ఎస్ ప్లీనరీ? తెలంగాణలో గతంలో జరిగిన ఉపఎన్నికల ప్రచారానికి భిన్నంగా సాగుతోంది హుజురాబాద్ బైఎలక్షన్. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాయి కానీ.. భారీ…
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టినెలకొంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉపఎన్నిక మారిపోవడంతో ఫలితం ఎలా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నేతలంతా నువ్వా.. నేనా? అన్నట్లుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇదే అదనుగా ఎన్నికల అధికారులు సైతం దూకుడుగా వెళుతున్న నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 13రోజుల్లోనే ప్రధాన పార్టీల నేతలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులపై 40కిపైగా కేసులు నమోదు చేశారు. దీంతో హుజూరాబాద్ బైపోల్ కేసుల…
హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంట్ డౌన్ మొదలైంది. ఆక్టోబర్ 30కి ఇంకో పక్షం రోజులే ఉంది. దాంతో ప్రచారం రోజు రోజుకు ఉదృతమవుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ గెలుపు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాయి. గడగడపకు వెళ్లి ఓటర్లకు తమ వాదన వినిపిస్తున్నారు. ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.అయితే ఓటర్లు చాలా తెలివైన వారు కదా.. అందుకే ఎవరు ఏం చెప్పినా సైలెంట్గా తల ఊపు ఊరుకుంటున్నారు. ఎవరు గెలుస్తారని…
హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుంచి రాజకీయ నాయకుల ఫోకస్ అంతా ఇక్కడే నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ తగ్గెదెలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో నేతలంతా ఓటర్లు చుట్టూ తిరగాల్సిన ఉండగా ఆసుప్రతుల చుట్టూ తిరుగుతుండటం ఆందోళన రేపుతోంది. హుజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య నెలకొంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ కు…
తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యంత కాస్లీ ఉప ఎన్నికగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డుకు ఎక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితం చివరి వరకు దోబుచులాట ఆడే అవకాశం ఉండటంతో ఇక్కడి ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో నేతలు ఈ అంశంపై…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మరోసారి నామినేషన్ దాఖలు చేసారు. ఆ గెల్లు శ్రీనివాస్ వెంట నామినేషన్ కేంద్రానికి మంత్రి హరీష్ రావు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బలు మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయగా అతని వెంట నామినేషన్ కు కేంద్రానికి వచ్చారు కాంగ్రెస్ నాయకులు…
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్కు లేఖరాశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… హుజురాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ను తొలగించాలి, స్థానిక పోలీస్ కమిషన్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని.. అభ్యర్థి మద్దతుదారులను స్థానిక…