హుజురాబాద్ లో టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించినట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యంత కాస్లీ ఉప ఎన్నికగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డుకు ఎక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితం చివరి వరకు దోబుచులాట ఆడే అవకాశం ఉండటంతో ఇక్కడి ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో నేతలు ఈ అంశంపై ఇప్పటికే దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా అందరూ చూస్తున్నారు. ఇరుపార్టీల ప్రచారం సైతం ఇదే తరహాలో కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుపార్టీలకు కొన్ని అంశాలు అడ్వాంటేజ్ గా మారనుండగా మరికొన్ని అంశాలు మైనస్ గా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈటల రాజేందర్ గతంలో హుజూరాబాద్లో చేసిన అభివృద్ధి, సానుభూతి అంశాలు కలిసి రానున్నాయి. అయితే ఆయనపై టీఆర్ఎస్ చేస్తున్న అవినీతి ఆరోపణలు ఆయనకు నెగిటివ్ గా మారే అవకాశం కన్పిస్తోంది. ఈక్రమంలో ఈటల రాజేందర్ గెలుపు అంత ఈజీ కాదనే టాక్ విన్పిస్తోంది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
టీఆర్ఎస్ మరో రెండేళ్లు అధికారంలో ఉండనుండటంతోపాటు కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కలిసి రానున్నాయి. అదేవిధంగా దళితబంధు పథకం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే టాక్ విన్పిస్తోంది. అయితే ప్రభుత్వంపై నిరుద్యోగ యువతలో పెద్దఎత్తున వ్యతిరేకత ఉండటం మైనస్ గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెగిటివ్ అంశాలను ఇరుపార్టీలు ఏమేరకు తగ్గించుకుంటే వారే విజేతలుగా గెలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ కేవలం నామమాత్రంగానే కన్పిస్తోంది. ఆపార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడానికి చాలా సమయం తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బల్మూరి వెంకట్ మరో 14రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గం అంతటా తిరిగి ప్రచారం చేయగలుగుతారా? అనేది సందేహం మారుతోంది. కాంగ్రెస్ కు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ అభ్యర్థి ఎంపిక ఆలస్యం కారణంగా ఆపార్టీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో గతంలో వచ్చిన ఓట్లైనా ఈసారి వస్తాయనేది ప్రశ్నగా తలెత్తుతోంది.
మరోవైపు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. ఈటల రాజేందర్ వెంట వెళ్లిన టీఆర్ఎస్ నేతలను తిరిగి సొంతగూటికి తీసుకొచ్చింది. ఈ విషయంలో టీఆర్ఎస్ చాలా వరకు సక్సస్ అయిందనే చెప్పాలి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా ఆపార్టీ సీనియర్ నేతల నుంచి ఆయనకు పెద్ద సపోర్ట్ రావడం లేదు. దీంతో ఆయన తన బలాన్ని నమ్ముకునే ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. సానుభూతి పవనాలు తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. అయితే ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడుగా వెళుతుండగా బీజేపీ కొంత వెనుకబడినట్లు కన్పిస్తోంది. అయితే పోలింగ్ సమయానికి కల్లా రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!