Human Sacrifice: హర్యానాలో దారుణం జరిగింది. దేవత కలలో కనిపించి నరబలి కోరిందని చెబుతూ ఓ మహిళ యువకుడిని హత్య చేసింది. బుధవారం సాయంత్రం ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియా ఇంట్లో మహేష్ గుప్తా(44) మృతదేహం లభ్యమైంది.
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు.
Savitri Jindal: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. హర్యానా కురుక్షేత్ర నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయన తల్లి, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కూడా బీజేపీలో చేరారు.
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. టూర్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మర్యాద పూర్వకంగానే ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది.
Manohar Lal Khattar: హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ తన ఎమ్మెల్యే పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేయడం గమనార్హం ఖట్టర్ 2014 నుంచి కర్నాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. కర్నాల్ లోక్సభ అభ్యర్థిగా ఖట్టర్ని బీజేపీ బరిలోకి దింపొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Haryana: హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. ఛండీగఢ్లో గవర్నర్ బండారు దత్రాత్రేయ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కూడా ఉన్నారు. బీజేపీ-జేజేపీ మధ్య ఎంపీ సీట్ల షేరింగ్పై విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రిని మారుస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.
హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపీ కూటమిలో విభేదాలు వచ్చిన.. నేపథ్యంలో సీఎం (Haryana CM) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) ఇవాళ రాజీనామా చేశారు.