తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గోవిందా.. గోవిందా అంటూ స్పీచ్ మొదలెట్టారు. అన్నీ సర్వేలు కూటమిదే విజయం అంటోందని తెలిపారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ ను ఎమ్మెల్యేగా గెలిపించడం అవసరమా అని…
మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్.. కల్వకుంట్ల పేరు తీసేసి అబద్ధాల కేసీఆర్ అని పెట్టాలన్నారు. కేసీఆర్ బాధ కరెంట్ గురుంచి కాదు.. పొలిటికల్ పవర్ లేదని ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసేటపుడు మూడు సార్లు కరెంట్ పోయింది అంటే ఎవరు నమ్మరని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఎప్పుడు విడిపోతే అప్పుడు సీఎం కావాలి…
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ వాళ్లు గజగజ వణుకుతున్నారని అన్నారు. ఢిల్లీకి వెళ్లి మోడీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యాడని తెలిపారు. నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలనలో తిట్లు లేకపోతే దేవుని మీద ఒట్టు అని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 2 లక్షల…
Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే..అని బండి సంజయ్ అన్నారు. ఎంపీ నిధుల నుండి కరీంనగర్ జైలులో అంబులెన్స్ ,ల్యాబ్ అందించారు.
అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అవినీతిలో పవన్…
టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాశమే హద్దుగా కుప్పం ప్రజలు అభిమానం చూపిస్తున్నారని అన్నారు. ఈసారి కుప్పంలో లక్ష మెజారిటీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పెయింటింగ్స్ మీదా ఉండే అభిమానం ప్రజల మీద లేదని ఆరోపించారు. జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడా అని దుయ్యబట్టారు. జగన్ బటన్ నొక్కడంలో చిదంబరం రహస్యం ఉందని విమర్శించారు. సొంత పేపర్ కు యాడ్ ఇవ్వడానికి…
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు ఎదురు చూస్తాం.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిరసన తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా.. ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు.. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఆయన అన్నారు. లేదంటే…
పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్.. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో నోరుజారాడు. అతను తన పరిమితులను మరిచిపోయి బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యారాయ్ గురించి చెడుగా మాట్లాడాడు. జట్టు సభ్యుల్లోనూ, బోర్డులోనూ సంకల్పమే సరిగా లేదని చెబుతూ... ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారత్ లోనే కాదు, పాకిస్థాన్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావలి పట్టణంలో ఒక బస్సు డ్రైవర్ ని కొంతమంది రౌడీ మూకలు కొట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటనకు పప్పు(లోకేశ్), దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) రాజకీయ రంగు పులిమారని ఆరోపించారు. ఆ రౌడీ ముఠాను ఎదిరించినందుకు తన కారు పై కూడా గతంలో దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ముఖ్యమంత్రికి ఆపాదిస్తుంటారని ఎమ్మెల్యే రామిరెడ్డి…