Nandigama Suresh: వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigama Suresh: అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యే శంకరనారాయణ, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యం కల్పించిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఎంపీ విమర్శించారు.
Read Also: CEC: సీఈసీ వద్దకు రాజకీయ పార్టీలు క్యూ.. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు
Also Read
- Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చరమగీతం పాడుతామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే, ఏపీలో టీడీపీ వస్తుందన్నట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రెండు ఎకరాల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలకు చంద్రబాబు అక్రమ సంపాదన అని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు కసరత్తుపై మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండే నాయకులకే సీఎం జగన్ టిక్కెట్లు ఇస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. సమన్వయకర్తల నియామకంలో కులాలను అంటగట్టొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రత్యర్థి అని.. ఆ పార్టీలో ఎవరున్నా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు.
Read Also: Ashika Ranganath: జూనియర్ అనుష్క అనిపించుకోవడం హ్యాపీనే.. నా సామిరంగ భామ ఆషిక రంగనాధ్ ఇంటర్వ్యూ
ఎమ్మెల్యే శంకరనారాయణ మాట్లాడుతూ.. బలహీన వర్గాలను బలోపేతం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య, పేదలకు కార్పొరేట్ విద్య అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే అని తెలిపారు. సీఎం జగన్ సామాజిక న్యాయం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తలెత్తుకుని తిరుగుతున్నాయని పేర్కొొన్నారు. కాగా.. కుట్రలకు మారుపేరు చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో జరిగిన సామాజిక న్యాయంపై బహిరంగ చర్చకు సిద్ధం అని అన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే చంద్రబాబు చర్చకు సిద్ధమా..? అని ఎమ్మెల్యే శంకరనారాయణ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!