Nandigama Suresh: వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigama Suresh: అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యే శంకరనారాయణ, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యం కల్పించిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఎంపీ విమర్శించారు.
Read Also: CEC: సీఈసీ వద్దకు రాజకీయ పార్టీలు క్యూ.. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు
Also Read
- Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
- Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చరమగీతం పాడుతామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే, ఏపీలో టీడీపీ వస్తుందన్నట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రెండు ఎకరాల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలకు చంద్రబాబు అక్రమ సంపాదన అని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు కసరత్తుపై మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండే నాయకులకే సీఎం జగన్ టిక్కెట్లు ఇస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. సమన్వయకర్తల నియామకంలో కులాలను అంటగట్టొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రత్యర్థి అని.. ఆ పార్టీలో ఎవరున్నా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు.
Read Also: Ashika Ranganath: జూనియర్ అనుష్క అనిపించుకోవడం హ్యాపీనే.. నా సామిరంగ భామ ఆషిక రంగనాధ్ ఇంటర్వ్యూ
ఎమ్మెల్యే శంకరనారాయణ మాట్లాడుతూ.. బలహీన వర్గాలను బలోపేతం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య, పేదలకు కార్పొరేట్ విద్య అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే అని తెలిపారు. సీఎం జగన్ సామాజిక న్యాయం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తలెత్తుకుని తిరుగుతున్నాయని పేర్కొొన్నారు. కాగా.. కుట్రలకు మారుపేరు చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో జరిగిన సామాజిక న్యాయంపై బహిరంగ చర్చకు సిద్ధం అని అన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే చంద్రబాబు చర్చకు సిద్ధమా..? అని ఎమ్మెల్యే శంకరనారాయణ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!