Chandrababu: వైసీపీకి పెయింటింగ్స్ మీద ఉండే అభిమానం ప్రజలు మీదా లేదు..
టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాశమే హద్దుగా కుప్పం ప్రజలు అభిమానం చూపిస్తున్నారని అన్నారు. ఈసారి కుప్పంలో లక్ష మెజారిటీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పెయింటింగ్స్ మీదా ఉండే అభిమానం ప్రజల మీద లేదని ఆరోపించారు. జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడా అని దుయ్యబట్టారు. జగన్ బటన్ నొక్కడంలో చిదంబరం రహస్యం ఉందని విమర్శించారు. సొంత పేపర్ కు యాడ్ ఇవ్వడానికి జగన్ బటన్ నొక్కుతున్నాడని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. స్కూల్ బిల్డింగ్ లకు పెయింటింగ్ వేస్తే విద్యా వ్యవస్థను మార్పు చేసినట్లా ? అని ప్రశ్నించారు. జగన్ కుప్పంలోను రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ళు బాదుడే బాదుడే.. నిత్యావసర సరుకుల నుండి కరెంట్ చార్జీల వరకు అన్ని పెంచుకుంటూపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ళకి పది రూపాయలు ఇచ్చి.. వారి దగ్గర నుండి వంద రూపాయలు జగన్ కొట్టేస్తున్నాడని ఆరోపించారు.
Guntur Kaaram : ఆ ట్యూన్ కాపీ అంటూ మళ్ళీ థమన్ పై ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Also Read
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
జగన్ కు నిద్రలేసినప్పటి నుండి అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టాలీపుడ్, బాలీపుడ్ ఇంటర్నేషనల్ కూడా బాబాయ్ హత్య లాంటి స్టోరీ ఉండదు ఏమోనని ఎద్దేవా చేశారు. గుండె పోటు అని మొదట చెప్పారు.. మళ్ళీ రక్తపు వాంతులన్నారు.. మళ్ళీ గొడ్డలి పోటు అని తేల్చారని అన్నారు. అన్ని డ్రామాలు ఆడి చివరికి నారావారి రక్తచరిత్ర అంటూ నిందలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ప్రమేయం ఉందని సీబీఐ అరెస్టు చేయడానికి వెళితే జగన్ కష్టపడి కాపాడాడన్నారు. సింపతితో గత ఎన్నికల ఓట్లు వేసుకున్నాడని.. ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న మీ మరణశాసనం మీరే రాసుకున్నట్లేనని చంద్రబాబు తెలిపారు.
Traffic Restrictions: విశాఖలో రేపు, ఎల్లుండి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు..
వైసీపీ మునిగిపోయిన పడవ.. వైసీపీ ఎమ్మెల్యేలు తలో దిక్కుకు పారిపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్ళుగా అందరినీ ఏడిపించారు.. ఇప్పుడు జగన్ వంతు వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ కుప్పంలో రావాలి.. కుప్పం కోసం కుప్పంలో పెద్దిరెడ్డి తిరుగుతున్నాడని తెలిపారు. తల్లిని, చెల్లిని పట్టించుకోని వాడు మనల్ని పట్టించుకుంటాడా అని అన్నారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లే రాష్ట్రం ఉంది.. ఇప్పటికి కొందరు అధికారులు భయపడుతున్నారు.. కాని ఎన్నికల సమయంలో వారి చేయాల్సింది చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. చివరలో కుప్పం ప్రజలకు చంద్రబాబు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు.
తాజావార్తలు
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?