Home
Gujarath Titans
Gujarath Titans News
-
IPL 2022: సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?
పూణెలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 50 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 64 పరుగులు చేసి తుదికంటా నాటౌట్గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లలో సాహా 21 పరుగులు, మిల్లర్ 11, రాహుల్… -
IPL 2022: పంజాబ్కు వణుకు పుట్టిస్తున్న రాహుల్ తెవాటియా
ఐపీఎల్లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగనుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఆడేది తొలి సీజన్ అయినా గుజరాత్ టైటాన్స్ అద్భుత ఆటతీరు కనపరుస్తోంది. హార్డిక్ పాండ్యా నేతృత్వంలోని ఆ జట్టు ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటివరకు టోర్నీలో 9 మ్యాచ్లు ఆడి 8 విజయాలు సాధించి 16 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మరో రెండు పాయింట్లు సాధిస్తే… -
Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ సక్సెస్ సీక్రెట్ ఇదే..!!
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు 9 మ్యాచ్లు ఆడగా 8 మ్యాచ్లలో విజయాలు సాధించింది. ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్లోనే అద్భుత ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా జట్టు విజయాల గురించి కెప్టెన్ హార్డిక్ పాండ్యా స్పందించాడు. జట్టులో ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే హెచ్చుతగ్గులు లేకపోవడమే తమ విజయాలకు కారణమన్నాడు. తాను కెప్టెన్ అయినా జట్టులోని మిగతా ఆటగాళ్లు తక్కువ అన్న… -
Hardik Pandya: తిరిగి టీమిండియాలోకి రావడం నా చేతుల్లో లేదు.. ఐపీఎల్పైనే నా దృష్టి
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో టీమిండియా ఆల్రౌండన్ హార్డిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ద్వారా పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హార్డిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేయడం గుజరాత్ టైటాన్స్కు కలిసొచ్చిందనే చెప్పాలి. మహా జట్లను తోసిరాజని టైటిల్ రేసులో గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతుందంటే దానికి కారణం హార్డిక్ పాండ్యానే. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ ప్లేస్మెంట్లలోనూ అతడు తనదైన మార్క్… -
IPL 2022: ప్లే ఆఫ్స్ చేరుకునే నాలుగు జట్లు ఇవేనా?
గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే.. ఈసారి ఐపీఎల్ అంచనాలకు భిన్నంగా చాలా రసవత్తరంగా సాగుతోందని చెప్పుకోవచ్చు. రెండు కొత్త జట్ల రాకతో మొత్తం రూపురేఖలే మారిపోయాయి. ఆయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఇతర జట్లలోకి జంప్ కావడంతో స్ట్రాంగ్గా ఉండే టీమ్స్ బలహీన పడ్డాయి. ఉదాహరణకు.. ముంబై ఇండియన్సే తీసుకోండి. ఐదుసార్లు కప్ గెలిచిన ఈ జట్టు ఈ సీజన్లో మాత్రం ఇంతవరకూ ఖాతా తెరవలేదు. టీమ్ స్ట్రాంగ్ గానే ఉన్నా, ఆటగాళ్లే సరైన ఆటతీరు కనబర్చడం… -
IPL 2022: అప్పుడు లయన్స్.. ఇప్పుడు టైటాన్స్
క్రికెట్లో కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఐపీఎల్లోనూ ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గతంలో గుజరాత్ లయన్స్ జట్టు ఎలా ఆడుతుందో.. ఈ ఏడాది కొత్తగా రంగ ప్రవేశం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా అలానే ఆడుతుండటం హాట్ టాపిక్గా మారింది. 2016 సీజన్లో గుజరాత్ లయన్స్ జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్లలో గెలిచింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన 4వ మ్యాచ్లో గుజరాత్ లయన్స్ ఓటమి పాలైంది. కట్ చేస్తే.. ఇప్పుడు… -
IPL 2022: లక్నో ఆటగాడు ఆయుష్ బదోనీ సరికొత్త రికార్డు
ఐపీఎల్ ద్వారా మరో యువ కెరటం వెలుగులోకి వచ్చింది. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా లక్నో ఆటగాడు ఆయుష్ బదోనీ తన సత్తా చూపించాడు. అయితే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే అతడు రికార్డు సృష్టించాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఆయుష్ బదోనీ మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా 41… -
IPL 2022: రాహుల్ జట్టుపై గెలిచిన పాండ్యా టీమ్
ఐపీఎల్లో రెండు కొత్త జట్లు ఈరోజు అమీతుమీ తేల్చుకున్నాయి. అయితే ఈ పోరు కేఎల్ రాహుల్ టీమ్పై హార్డిక్ పాండ్యా జట్టు విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (55), ఆయుష్ బదోనీ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం… -
IPL 2022: హాఫ్ సెంచరీలతో రాణించిన హుడా, బదోనీ.. లక్నో స్కోర్ ఎంతంటే..?
ఐపీఎల్లో కొత్త జట్ల సమరం ఆసక్తికరంగా సాగింది. సోమవారం రాత్రి లక్నో సూపర్జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో టీమ్కు తొలి బంతికే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. గుజరాత్ బౌలర్ మహ్మద్ షమీ ఈ వికెట్ సాధించాడు. షమీ విజృంభించడంతో లక్నో టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్… -
IPL 2022: కొత్త జట్ల తొలి పోరు.. గెలుపెవరిదో..?
ఐపీఎల్లో రెండు కొత్త జట్ల అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఈరోజే తొలిసారిగా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఆ రెండు జట్లే లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్కు హార్డిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. తొలిసారిగా ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ రెండు జట్లలో విజయం…
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!