GT vs PBKS: ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. 153 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్ బౌలర్లు
Punjab Kings Scored 153 Runs In 20 Overs Against Gujarat Titans: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పంజాబ్ జట్టు 153 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. పంజాబ్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. పంజాబ్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ అర్థశతకం చేయలేదు. మాట్ షార్ట్ ఒక్కడే 36 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో షారుఖ్ ఖాన్ (9 బంతుల్లో 22 పరుగులు) కాస్త మెరుపులు మెరిపించడంతో.. పంజాబ్ 150 పరుగుల మైలురాయిని దాటగలిగింది.
GT vs PBKS: ఓవైపు వికెట్లు.. మరోవైపు పరుగులు.. నెట్టుకొస్తున్న పంజాబ్
Also Read
- Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
- MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
- Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. "ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం".. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..

తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే.. పంజాబ్ జట్టుకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సున్నా పరుగులకే ప్రభ్సిమ్రన్ సింగ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శిఖర్ ధవన్ (8) కూడా పెలివియన్ చేరాడు. మాట్ షార్ట్ (36) బాగానే కుదురుకున్నాడని అనుకునేలోపే.. అతడు కూడా 55 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం భానుక రాజపక్స, జితేశ్ శర్మ కలిసి ఆచితూచిగా ఆడుతూ.. జట్టుని ముందుకు నడిపించారు. అయితే.. గుజరాత్ బౌలర్ల ముందు వీళ్లు ఎక్కువసేపు నిలకడగా క్రీజులో ఉండలేకపోయారు. క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చారు. అయితే.. వచ్చిన వాళ్లు కొద్దోగొప్పో తమవంతు సహకారం అందించి.. జట్టు స్కోరు బోర్డును ముందుకు నడిపించగలిగారు.
Mouni Roy: ‘నాగిని’వో, భోగినివో.. కామకళా యోగినివో
చివర్లో పంజాబ్ బలహీనపడటం చూసి.. స్వల్ప స్కోరుకే చాపచుట్టేస్తుందని అందరూ భావించారు. అప్పుడు షారుఖ్ ఖాన్ అనూహ్యంగా షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టి అతడు జోష్ నింపాడు. కానీ.. పరుగులు చేయాలన్న ఆవేశంలో అతడు రనౌట్ అయ్యాడు. చివర్లో బ్రార్ ఒక సిక్స్ కొట్టాడు కానీ, అదే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడం.. పంజాబ్ జట్టుకి నష్టం వాటిల్లింది. చివరగా.. 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్ల విషయానికొస్తే.. మోహిత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, లిటిల్, జోసెఫ్, రషీద్ ఖాన్ తలా వికెట్ తీసుకున్నారు. మరి.. 154 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్ ఛేధిస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
-
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో