GT vs PBKS: ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. 153 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్ బౌలర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings Scored 153 Runs In 20 Overs Against Gujarat Titans: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పంజాబ్ జట్టు 153 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. పంజాబ్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. పంజాబ్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ అర్థశతకం చేయలేదు. మాట్ షార్ట్ ఒక్కడే 36 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో షారుఖ్ ఖాన్ (9 బంతుల్లో 22 పరుగులు) కాస్త మెరుపులు మెరిపించడంతో.. పంజాబ్ 150 పరుగుల మైలురాయిని దాటగలిగింది.
GT vs PBKS: ఓవైపు వికెట్లు.. మరోవైపు పరుగులు.. నెట్టుకొస్తున్న పంజాబ్
Also Read
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
- India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
- Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- PV Sindhu: విరాట్ కోహ్లీ చెప్పిన ఒక్క మాటే.. నా జీవితాన్ని పూర్తిగా మార్చింది!

తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే.. పంజాబ్ జట్టుకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సున్నా పరుగులకే ప్రభ్సిమ్రన్ సింగ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శిఖర్ ధవన్ (8) కూడా పెలివియన్ చేరాడు. మాట్ షార్ట్ (36) బాగానే కుదురుకున్నాడని అనుకునేలోపే.. అతడు కూడా 55 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం భానుక రాజపక్స, జితేశ్ శర్మ కలిసి ఆచితూచిగా ఆడుతూ.. జట్టుని ముందుకు నడిపించారు. అయితే.. గుజరాత్ బౌలర్ల ముందు వీళ్లు ఎక్కువసేపు నిలకడగా క్రీజులో ఉండలేకపోయారు. క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చారు. అయితే.. వచ్చిన వాళ్లు కొద్దోగొప్పో తమవంతు సహకారం అందించి.. జట్టు స్కోరు బోర్డును ముందుకు నడిపించగలిగారు.
Mouni Roy: ‘నాగిని’వో, భోగినివో.. కామకళా యోగినివో
చివర్లో పంజాబ్ బలహీనపడటం చూసి.. స్వల్ప స్కోరుకే చాపచుట్టేస్తుందని అందరూ భావించారు. అప్పుడు షారుఖ్ ఖాన్ అనూహ్యంగా షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టి అతడు జోష్ నింపాడు. కానీ.. పరుగులు చేయాలన్న ఆవేశంలో అతడు రనౌట్ అయ్యాడు. చివర్లో బ్రార్ ఒక సిక్స్ కొట్టాడు కానీ, అదే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడం.. పంజాబ్ జట్టుకి నష్టం వాటిల్లింది. చివరగా.. 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్ల విషయానికొస్తే.. మోహిత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, లిటిల్, జోసెఫ్, రషీద్ ఖాన్ తలా వికెట్ తీసుకున్నారు. మరి.. 154 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్ ఛేధిస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!