Google: సర్వీస్ ఫీజుల వివాదంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్లను తొలగించింది. అయితే, దీనిపై సదరు యాప్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ కంపెనీ అధికారులతో సమావేశమైన తర్వాత, తొలగించిన యాప్లను పునరుద్ధరించేందుకు గూగుల్ అంగీకరించినట్లు సమాచారం.
Google: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివాదంలో భారత్ మ్యాట్రిమెనీ వంటి కొన్ని ప్రముఖ మ్యాట్రిమెనీ యాప్లతో సహా దేశంలోని 10 కంపెనీలకు చెందిన యాప్లను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దేశంలో యాంటీట్రస్ట్ అధికారులు 15 శాతం నుంచి 30 శాతం వసూలు చేసే విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించిన తర్వాత, యాప్ చెల్లింపులపై 11 శాతం నుంచి 26 శాతం వరకు రుసుమును విధించకుండా గూగుల్ని…
గూగుల్, యూట్యూబ్లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
2024వ సంవత్సరంలో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్స్. ఫ్లై (Layoffs.fyi) డేటాలో వెల్లడించింది.
Fake Loan Apps: నకిలీ రుణ యాప్లలో ప్రజలను ట్రాప్ చేయడానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోనుంది.
Google: ఇజ్రాయెల్ టెక్ సంస్థలు, పాలస్తీనా వ్యాపారాలకు మద్దతుగా Google $8 మిలియన్లు పెట్టుబడి పెడుతోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ సమయంలో ఫైనాన్సింగ్ను పొందేందుకు చిన్న కంపెనీల అవసరాన్ని పేర్కొంటూ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గ్రూప్ బుధవారం తెలిపింది.
Google: 2022 చివర్లో ప్రారంభమైన టెక్ లేఆఫ్స్ 2024లో కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం వల్ల వేలాది మంది ఉద్యోగులను ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు తొలగించాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్ ప్రపంచంలోకి శరవేగంగా దూసుకురావడం కూడా ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.
Lakshadweep: ఇండియా-మాల్దీవ్స్ వివాదం నడుమ ‘‘లక్షద్వీప్’’ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారతదేశంలో మొన్నటి వరకు పెద్దగా భారతీయులే పట్టించుకోని ఈ ద్వీపాల గురించి ప్రస్తుతం ప్రపంచమే సెర్చ్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఒక్క పర్యటన లక్షద్వీప్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచ టూరిస్టులు ఈ ఐలాండ్స్ గురించి ఇంటర్నెట్లో తెగవెతికేస్తున్నారు. సరైన విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో మాల్దీవ్స్ అవుతాయంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.