దొంగతనానికి వచ్చారు.. ఉన్నదంతా దోచుకున్నారు. అయితే ఇంతలోనే ఆకలి అయింది. దొంగలు ఏమనుకున్నారో ఏమో వంటింట్లో దూరారు. ఏమీ తినబండ్రాలు కనబడలేదు. అయితే ఫ్రిజ్లో పాలు కనపడ్డాయి. వాటిని తీసుకొని మరిగించుకొని తాగడమే కాకుండా.. తాగిన గ్లాసులను కడిగి అక్కడే పెట్టి వెళ్లిపోయారు. ఈ దొంగల వ్యవహారాన్ని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండలో నీ ఇంటిలో దొంగతనం జరిగింది. పెళ్లి కోసం దాచిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును కూడా దొంగలు దోచుకు…
తిరుపతి.. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి. ఈ నగరంలో పగలు, ప్రతీకారాలు, దొంగతనాలు తక్కువగా నమోదవుతుంటాయి. రాజకీయ దాడులు పక్కన పెడితే నేరాల సంఖ్య తక్కువే. అయితే ఈ మధ్యకాలంలో దొంగతనాలు తిరుపతి వాసుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తిరుపతి సమీప ప్రాంతాల్లో ఆగని చోరీలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగానికి దొంగతనాలు సవాల్ విసురుతున్నాయి. శ్రీనివాసమంగాపురంలో రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు దొంగలు. బీరువాలోని రూ.50వేల నగదు, 24గ్రాముల బంగారం…