Viral video: తన భార్యకు మొబైల్ ఫోన్ కొనిస్తున్న వ్యక్తిపై ‘‘గర్ల్ ఫ్రెండ్’’ దాడి చేసిన సంఘటన వైరల్గా మారింది. బీహార్ చాప్రాలో ఒక వ్యక్తి తనను మోసం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న అతడి గర్ల్ ఫ్రెండ్, మొబైల్ షాపులోనే అతడిని పట్టుకుని చితకబాదింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు.
తన గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి ఓ వ్యక్తి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. తన ప్రియురాలిని ఎలాగైనా మెప్పించాలని సంకల్పించాడు. దీని కోసం సింహాల బోనులోకి ప్రవేశించాడు. కానీ సింహాలకు అది అస్సలు నచ్చలేదు. సింహాలు ఆ వ్యక్తిపై దాడి చేసి చంపాయి. ఆ వ్యక్తికి సంబంధించిన చివరి క్షణాల వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్లోని ప్రైవేట్ జూలో ఈ ఘటన జరిగింది.
వారిద్దరూ మంచి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. పై చదువుల కోసం కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రతీ రోజూ కలిసి దూర ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. అయితే హఠాత్తుగా స్నేహితుడు హత్యకు గురయ్యాడు.
ప్రేమ సంబంధాలలో ఇద్దరి(ప్రియుడు, ప్రియురాలు)పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. అంగీకారంతో శారీరక సంబంధానికి సంబంధించిన అత్యాచారం కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇద్దరి అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత అత్యాచారం కేసు నమోదు చేయరాదని పేర్కొంది. ఇలాంటి కేసులపై ఎస్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరులో కలకలం రేపుతోంది.. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు.. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు..
సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీవీ ఉంటే.. మరి కొన్ని హర్రర్ ఇతరత్రా వీడియోలు దర్శనమిస్తాయి. అయితే ఎక్కువగా ఫన్నీ వీడియోలను చూడటానికే నెటిజన్లు ఇష్టపడతారు. కొన్ని నమ్మే రకంగా ఉంటే..మరి కొన్ని నమ్మశక్యం కానీ వీడియోలు ఉంటాయి. అయితే.. ఇటీవల, బీహార్ లో ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రేమికురాలి కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఆ మోజులో ఉన్నవారు మైకంలో ఉండి ఏం చేస్తారో కూడా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర పూణేలోని చర్హోలీ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయిన కొద్ది రోజులకు తిరిగి వచ్చాడు. చనిపోయిన వ్యక్తి ఎలా వచ్చాడు? అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.. పూణేలోని చర్హోలీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మృతదేహం పొలాలు దున్నేందుకు ఉపయోగించే రోటావేటర్లో ఇరుక్కుపోయి ఛిద్రమైంది. మొండెం పైనుంచి తల కూడా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుస్తులను గుర్తించగా మృతదేహం…
యూపీలోని మీరట్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని బాయ్ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమని, విద్యార్థినిని మోసపూరితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో విద్యార్థి కుటుంబ సభ్యులకు చేరడంతో తీవ్ర మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.