Agarbatti Scam: రాజమండ్రి కేంద్రంగా సాగుతున్న భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అగరబత్తీలు, ఇతర వస్తువుల తయారీ పేరుతో సుమారు 3,000 మంది మహిళలను నమ్మించి, వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ముంచేసిన ఉదంతంపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనకాపల్లికి చెందిన వరదా మోహన్ కృష్ణ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇంటి వద్దే ఖాళీగా ఉండే మహిళలకు ఉపాధి కల్పిస్తామంటూ ఆశ…
Nuzvid: అమాయక ప్రజల ఆశను పెట్టుబడిగా మార్చుకున్న కొందరు కేటుగాళ్లు ‘రైస్ పుల్లింగ్’ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష రూపాయలు ఇస్తే ఏకంగా కోటి రూపాయలు వస్తాయంటూ నమ్మబలికి సుమారు రూ. 2.5 కోట్లు వసూలు చేసిన ఉదంతం నూజివీడులో కలకలం రేపుతోంది. ఈ మోసంతో బాధితులు ఇప్పుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక.. నూజివీడుకు చెందిన దాచేపల్లి…
Fraud: వైద్య వృత్తిలో ఉన్న ఓ కిలాడీ జంట చిట్టీల పేరుతో మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో ప్రజల్ని మోసగించిన దంపతుల సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంపేట బండారీ లేఅవుట్లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్న రేష్మ, అలీ అనే భార్యాభర్తలు సుమారు 100 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపుగా రూ. 150 మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Money Laundering Scam: రోజురోజుకు సమాజంలో ఆర్ధిక నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులు అన్ని విధాల ఈ ఆర్ధిక నేరాలకు సంబంధించి అలర్ట్ చేస్తున్న ప్రజలు మాత్రం సైబర్ నేరాల ఉచ్చులో నుంచి బయటకి రాలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ దోపిడీ విషయం బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. బాధితుడు హైదరాబాద్లోని దోమల్గూడలో నివసిస్తున్న 79 ఏళ్ల వ్యక్తి CBI ముసుగులో దోపిడీ స్కామ్కు గురయ్యాడు. జూలై 6, 2025న బాధితుడికి CBI…
Fake Officers: హైదరాబాద్ నగరంలో మోసాల ముఠా రెచ్చిపోయింది. ట్రస్ట్ లను లక్ష్యంగా చేసుకుని CSR ఫండ్స్ ఇప్పిస్తామని నమ్మించి, పెద్ద మొత్తంలో దోచుకున్న ముఠా గుట్టు మలక్పేట పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నగరంలోని ఓ ట్రస్ట్ను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా.. నకిలీ డాక్యుమెంట్లు, టాస్క్ ఫోర్స్ యూనిఫార్ములతో సినిమా స్టైల్లో మోసానికి పాల్పడింది. ఈ ముఠా సభ్యులు ట్రస్ట్ల వద్దకు వెళ్లి.. మా వల్ల మీరు భారీగా CSR ఫండ్స్ పొందవచ్చు అంటూ నమ్మకం…
చిట్టీల పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో రూ. 100 కోట్లు వసూళ్లు చేసి పుల్లయ్య పరారైన పుల్లయ్యను.. బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచాడు చిట్టీల పుల్లయ్య. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 సంవత్సరాల కిందట నగరానికి వచ్చారు. బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ…
Falcon Scam : ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో వేల మందిని మోసం చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ECIR) నమోదు చేయడంతో విచారణ మరింత వేగవంతమైంది. హైదరాబాద్ హైటెక్ సిటీ హుడా ఎన్క్లేవ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఈ సంస్థ, ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో అధిక లాభాలను వాగ్దానం చేసి, రూ.1,700 కోట్ల మేర నిధులను…
Amardeep Kumar: ఫైనాన్షియల్ స్కామ్లతో సంబంధం ఉన్న ఫాల్కన్ గ్రూప్ చైర్మన్ అమర్ దీప్ కుమార్ దుబాయ్కు పారిపోయాడు. తన అనుచరగణంతో కలిసి ఓ చార్టెడ్ ఫ్లైట్లో దేశం విడిచిపెట్టినట్లు సమాచారం. భారత్లో డిపాజిట్ల రూపంలో ఏకంగా 1700 కోట్ల రూపాయల భారీ వసూలు చేసిన ఫాల్కన్ గ్రూప్, ఇందులో హైదరాబాద్లో మాత్రమే 850 కోట్ల రూపాయలు సేకరించింది. తక్కువ పెట్టుబడి పెట్టి అమెజాన్, బ్రిటానియా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నామని, అధిక వడ్డీ…
Falcon : హైదరాబాద్ నగరాన్ని కుదిపేసే విధంగా మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట కోట్లాది రూపాయలు మోసానికి పాల్పడిన ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి, ఫాల్కన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఫాల్కన్ సంస్థ చిన్న తరహా పెట్టుబడుల పేరుతో నిరుద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగస్తులను ఆకర్షించి దేశవ్యాప్తంగా వేలాదిమందిని మోసం చేసింది. ప్రముఖ సంస్థలు…
Fraud : క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి దుబాయ్ పారిపోదామనుకున్న రమేష్ గౌడ్ వ్యవహారం మరో విషయం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి కరీంనగర్ వరంగల్ జిల్లాలో 100 కోట్లు వసూలు చేశాడు రమేష్. రమేష్ ని కాపాడేందుకు సీఐడీ అధికారుల ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్లో కేసు నమోదు అయినప్పటికీ అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. నిందితుడైన రమేష్ తో…