సూర్యాపేట జిల్లాలో కోదాడ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో, ఎవరితో కలిసి పోటీ చేస్తామో త్వరలో వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన నేతలు పర్యటిస్తారని.. తాను కూడా తెలంగాణలో తిరిగేందుకు సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం తెలంగాణలోనే ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు. KCR: కేసీఆర్ ఆలిండియా టూర్…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. జూన్ 10వ తేదీన పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఇక, జూన్ 1న నామినేషన్లు పరిశీలన, జూన్ 3న నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ కాగా..…
2024 ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలపై త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామని ప్రకటించారు. తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తాడేపల్లిలో జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరుకానున్నారు. కాగా మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీతో…
మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు డైరెక్షన్లో మూడు నెలలుగా బ్రహ్మాండమైన సినిమా నడుపుతున్నారు…. అది అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయం అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు లేదన్నారు అమర్నాథ్. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం అడుకుంటోంది. రైతులను మోసం చేసింది చంద్రబాబు అనేది దత్తపుత్రుడు తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుసరించిన మోసపూరిత హామీలే కౌలు…
పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడి జాతీయ అసెంబ్లీని… రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ చేస్తోన్న ప్రయత్నాలు సాఫీగా సాగేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతుండగా.. వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లుగా వచ్చే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమేనని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ చెబుతోంది. ముఖ్యంగా న్యాయపరమైన, రాజ్యాంగ…
ఏపీలో ఇప్పుడంతా కేబినెట్ మార్పుల గురించే చర్చించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్టీవీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ సీఎం జగన్ ఆలోచన ప్రకారం జరుగుతుంది. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే అన్నారు. మంత్రివర్గ మార్పులు.. చేర్పులపై ఎవరికీ క్లారిటీ లేదు. సీఎం జగన్ ఏ రోజు చెబితే ఆ రోజు రాజీనామాలు చేసేందుకు మంత్రులందరూ సిద్ధంగా వున్నామన్నారు. సీఎం జగన్ నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ఎవరుండాలని నిర్ణయిస్తే వారే ఉంటారు. జనసేన…
గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముద్ర గతంలో ఎన్నడూ లేనంత అల్ప స్థాయికి పడిపోయింది. దాంతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన రాజకీయ పార్టీ తన జాతీయ ప్రాముఖ్యతను కోల్పోతోందని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల విస్తరణతో దశాబ్దాలుగా భారత రాజకీయాలపై గల తన ఆధిపత్య శక్తిని కోల్పోతోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ…
కాంగ్రెస్ అసమ్మతి నేతల డిన్నర్ సమావేశం హాట్ హాట్ గా సాగుతోంది. గులామ్ నబీ ఆజాద్ నివాసంలో కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నేతల “డిన్నర్ సమావేశం పార్టీలో సోనియా విధేయులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అజాద్ నివాసంలో “డిన్నర్ సమావేశానికి” హాజరయ్యారుకపిల్ సిబల్, శశి థరూర్, మనీష్ తివారి, భూపేందర్ సింగ్ హుడా, పృధ్విరాజ్ చౌహాన్, ఆనంద శర్మ, అఖిలేష్ ప్రసాద్ సింగ్, రాజ్ బబ్బర్, పి.జే.కురియన్, మణిశంకర్ అయ్యర్. అదనంగా ఈ రోజు “అసమ్మతి నేతల…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉంటుంది.. వైసీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. ఇప్పటికే ఇక్కడ్నుంచి రెండుసార్లు విక్టరీ కొట్టారు ఆర్కే రోజా. అయితే, పార్టీలోని అంతర్గత విభేదాలు ఎన్నో సార్లు గుప్పుమన్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజాపై ఆమె వ్యతిరేక వర్గం తిరుగుబాటు చేయడం చర్చగా మారింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం పోరు ఆసక్తిగా మారేలా కనిపిస్తోంది. ఎంతకంటే..? ఇప్పుడు…