విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. లాసన్స్బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
ED Raids On Muda office: కర్ణాటకలో సంచలనం రేపుతున్న మూడా స్కాం కేసులో 12 మంది సభ్యులతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం ఈరోజు (శుక్రవారం) మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంపై సోదాలు చేస్తుంది.
ED Raids On AAP MP House: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈరోజు (సోమవారం) తనిఖీలు చేశారు. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు కొనసాగిస్తుంది.
RG Kar Ex-Principal: కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఆఫీస్ & ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేసింది. హీరా గ్రూప్ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు వెనుదిరిగి పోయారు. కోట్లకు పైగా నిధులు గోల్ మాల్ జరిగినట్టు ఈడీ గుర్తించింది.
West Bengal : రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు తీసుకుంది. 14 గంటల విచారణ అనంతరం ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ నేతలను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
ED Raids on Ravinder Chandrasekar: రవీందర్ చంద్రశేఖర్ తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్. రవీందర్ చంద్రశేఖర్ తన సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ ద్వారా కవిన్ నటించిన లిఫ్ట్తో సహా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే రవీందర్ చంద్రశేఖర్ 2022 లో సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి అయినా రవీందర్ చంద్రశేఖర్ బాడీ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. పెళ్లయ్యాక కూడా…
ED Raids : కేరళకు చెందిన ఓ కంపెనీపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో దర్యాప్తులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వెల్లడించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్ ముగిసింది. మరోసారి అధికారాన్ని సొంత చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థల పేర్లు తరచూ వినబడుతుంటాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు చేస్తోంది. ఈ దాడిలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నుంచి 25 కోట్ల రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకుంది.