అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి అలాగే స్థానిక పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అసోం లోని సోనిత్ పూర్ జిల్లాలో భారత సైన్యం లోని ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ (ETF) యూనిట్ బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దాదాపు 5 వేల చెట్లను నాటినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ అనేది టెరిటోరియల్ ఆర్మీ (TA) కింద వస్తుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ అలాగే ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల్లో భారత సాయుధ దళాలు, పౌర…