Earthquake: ఫిలిప్పీన్స్ను భూకంపాలు బయపెడుతున్నాయి. గత కాలంగా ఆ దేశంలో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం కూడా తెల్లవారుజామున మరోసారి ఫిలిప్పీన్స్ లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఫిలిప్పీన్స్ లోని మిండానావో ప్రాంతంలో ఉదయం 7 గంటలకు 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం భూమికి 90 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని NCS తెలిపింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం…
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిండనోవా ద్వీపంలో ఈరోజు (అక్టోబర్ 10న) ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదు అయింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఫిలిప్పీన్స్లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దేశంలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, ఇళ్లు, కార్యాలయాల నుండి బయటకు పరుగులు తీశారని అధికారి తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా అనేక భవనాలు కూలిపోయి కనీసం 20 మంది మరణించారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భూకంప కేంద్రం, ప్రభావిత ప్రాంతాల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ప్రాథమిక నివేదికలు గణనీయమైన ఆస్తి…
మయన్మార్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. మయన్మార్ భూకంపం భారతదేశాన్ని కూడా కుదిపేసింది. మణిపూర్, నాగాలాండ్, అస్సాంతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. భూకంపం మణిపూర్లోని ఉఖ్రుల్కు ఆగ్నేయంగా 27 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్లోని భారత సరిహద్దుకు చాలా దగ్గరగా…
ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా కంపించింది భూమి.. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు చెబుతున్నారు..
Earthquake: నేడు (సెప్టెంబర్ 21) బంగ్లాదేశ్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మేఘాలయలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ భూకంపం ఉదయం 11:49 గంటలకు (IST) బంగ్లాదేశ్తో మేఘాలయ సరిహద్దుకు సమీపంలో సంభవించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, మేఘాలయలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా బంగ్లాదేశ్లోని ఢాకా, చిట్టగాంగ్తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే, ఈ ఘటనలో…
రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు సంభవించాయి. రష్యాలో తీవ్రత 7.8గా.. ఇండోనేషియాలో 6.1గా తీవ్రత నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున రష్యాలోని కమ్చట్కాలో భూ కంపం సంభవించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
భూప్రకంపనలు అంటే ఎవరైనా హడలెత్తిపోతారు. బతుకు జీవుడా అంటూ పరుగులు పెడతారు. ఏ ఒక్కరికైనా భయాందోళనలు సహజం. కానీ అస్సాంలోని నర్సులు మాత్రం వృత్తికి తగినట్టుగా తమ బాధ్యతలు నెరవేర్చి శెభాష్ అనిపించుకుంటున్నారు.
Earthquake: అస్సాంలోని గువాహటిలో 5.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర బెంగాల్, పొరుగున ఉన్న భూటాన్లో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం కొద్ది రోజుల క్రితమే.. అంటే సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్పూర్లో 3.5 తీవ్రతతో కూడిన మరో భూకంపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సంభవించింది. రోజూ సూర్య నమస్కారం చెయ్యడంతో ఆరోగ్యం, ఆనందం,…
ఆప్ఘనిస్థాన్ను మరోసారి భూకంపం వణికించింది. మూడు రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం నుంచే ఇంకా తేరుకోలేదు. తాజాగా గురువారం కూడా మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.8గా నమోదైంది. 135 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.