డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు బహిరంగ లేఖ రాశారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ఉండవల్లి.. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి పవన్ కల్యాణ్ శ్రద్ధ తీసుకోవాలని లేఖలో కోరారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు.. అయితే, ఉన్నట్టుండి ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ప్రశంసల వర్షం కురిపించారు.. పవన్ కల్యాణ్ను ఉద్దేశిస్తూ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ను అధికార యంత్రాంగం సీజ్ చేసింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఇప్పటికే పీడీఎస్ బియ్యంపై ఏపీ సర్కారు సీరియస్గా ఉన్న సమయంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ బియ్యం విషయంలో ప్రభుత్వం సీరియస్ అవడంతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.
నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.. కాకినాడ పోర్ట్ వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్లో వెళ్లిన పవన్.. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పరిశీలించారు.. ఈ బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు.. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు పవన్…
ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ (ఎక్స్లో పోస్టు) ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.. ‘మోడీ నాపై చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది.. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు.. గాంధీనగర్లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ప్రత్యేక…
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రైల్వే శాఖ మంత్రితో విశాఖ రైల్వే జోన్ గురించి చర్చించినట్లు తెలిపారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. దేశంలో ఎన్నో కొత్త రైలు వస్తున్నాయని.. పిఠాపురానికి మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని రైల్వే మంత్రికి తెలిపారు. "శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయానికి భక్తులు వస్తారని మంత్రికి…
తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో సమావేశం అయ్యారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంట.. జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు గజేంద్ర సింగ్ షెఖావత్ అంటే అపారమైన గౌరవం అన్నారు.. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని గుర్తుచేశారు.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు.. ఈ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ చేరుకున్నారు పవన్ కల్యాణ్.. అయితే, ఈ రోజు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్ ప్రాజెక్టులు.. ఇతర అంశాలపై చర్చించనున్నారు..