Deputy CM Pawan Kalyan: గజేంద్ర సింగ్ షెఖావత్లో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ.. ఏడు ప్రాజెక్టుపై ప్రతిపాదనలు..
- ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీ..
- కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో సమావేశం..
- ఏపీ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందజేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.. సోమవారం ఢిల్లీ చేరుకున్న ఆయన.. తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో సమావేశం అయ్యారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంట.. జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు గజేంద్ర సింగ్ షెఖావత్ అంటే అపారమైన గౌరవం అన్నారు.. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని గుర్తుచేశారు.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది.. గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చు అన్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని గజేంద్ర సింగ్ షెఖావత్ను కోరామని.. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: President Droupadi Murmu: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్సభ స్పీకర్
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఇక, ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా గడపనున్నారు పవన్ కల్యాణ్.. ఈ రోఉ మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు.. మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు.. ఏపీకి రావాల్సిన నిధులు.. పెండింగ్ అంశాలపై సమాలోచనలు చేయనున్నారు.. సాయంత్రం 4:30కి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యి.. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు.. ఇక, సాయంత్రం 5:15 గంటలకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటీకానున్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. పార్లమెంట్ లో రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!