Pawan Kalyan: రైల్వే మంత్రితో ముగిసిన పవన్ భేటీ.. పిఠాపురంలో పలు అభివృద్ధి పనులపై చర్చ
- రైల్వే మంత్రితో పవన్ భేటీ
- భేటీ అనంతరం మాట్లాడిన డిప్యూటీ సీఎం
- విశాఖ రైల్వే జోన్ గురించి చర్చ
- వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు కృతజ్ఞతలు
- పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కోరకు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రైల్వే శాఖ మంత్రితో విశాఖ రైల్వే జోన్ గురించి చర్చించినట్లు తెలిపారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. దేశంలో ఎన్నో కొత్త రైలు వస్తున్నాయని.. పిఠాపురానికి మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని రైల్వే మంత్రికి తెలిపారు. “శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయానికి భక్తులు వస్తారని మంత్రికి వివరించాను. పిఠాపురం మీదుగా వెళ్లే రైళ్లను అక్కడ ఆపాలని రైల్వే శాఖ మంత్రిని కోరాను. మంత్రి సానుకూలంగా స్పందించారు. పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కోరకు విజ్ఞప్తి చేశాం. పీఎం గతి శక్తి కింద ఇచ్చేలా ప్రాసెస్ చేస్తామని చెప్పారు.” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
READ MORE: Drug Peddling Gang Arrested: మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత
Also Read
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారని తాను కూడా ఎదురు చూస్తున్నట్లు పవన్ కళ్యాన్ తెలిపారు. ఆర్థిక రాజధానిగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులు దాడులు చేస్తే దేశం విల విల్లాడిందన్నారు. ప్రస్తుతం సుస్థిరమైన ప్రభుత్వం మహారాష్ట్ర ఏర్పడిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా లాతూర్ ప్రచారంలో అక్కడి ప్రజలకు తానొక హామీ ఇచ్చినట్లు పవన్ గుర్తు చేశారు. లాతూర్ నుంచి తిరుపతికి నేరుగా ఒక ట్రైన్ కావాలని చెప్పి పోటీ చేసిన వాళ్లతో పాటు ప్రజలు అడిగారని.. ఈ అంశంపై కేంద్ర మంత్రితో ప్రస్తావించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!