Pawan Kalyan Meets PM Modi: ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. మోడీకి డిప్యూటీ సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు
- ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన పవన్..
- ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్..
- మోడీ నాపై చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది..
- ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Meets PM Modi: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్ అంశాలపై చర్చించిన ఆయన.. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఇక, ఆ తర్వాత ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ (ఎక్స్లో పోస్టు) ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.. ‘మోడీ నాపై చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది.. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు.. గాంధీనగర్లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: EAGLE: గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే.. ఈగల్గా మారిన ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ఇక, ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ను.. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమైన ఆయన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడింది. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగడమే వాదనీయంగా ఉంది. ఏపీకి చెందిన రూ.110 కోట్లు విలువైన ఎర్రచందనం దుంగలు కర్ణాటకలో దొరికాయి, వాటిని ఆ రాష్ట్రం విక్రయించింది. అంతేకాకుండా, ఇవి విదేశాల్లో కూడా దొరికితే తిరిగి భారతదేశంలోకి రప్పించవచ్చు. కానీ, పొరుగు రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనాన్ని స్వరాష్ట్రానికి రప్పించడం సాధ్యమవుతుందా? ఈ అంశంపై నేను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో చర్చించాను. ఈ ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరాను.” అలాగే, అదానీ పవర్ ప్రాజెక్టు అంశం గురించి ఆయన వివరించవచ్చు, “ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది, దీనిపై పూర్తి అవగాహన అవసరం.” అన్నారు.. మరోవైపు.. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండించారు పవన్.. బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత సైన్యం చేసిన త్యాగాలు మరువకూడదు. ఇక్కడ మైనార్టీలను ఎలా చూస్తున్నామో, అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు? పాలస్తీనాలో ఏదైనా జరిగినప్పుడు స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్లో జరిగే ఈ దుర్ఘటనలపై ఎందుకు స్పందించరు? అని నిలదీశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
I am grateful to Hon PM. Shri @narendramodi Ji for giving his valuable time amidst hectic parliament sessions. From my first meeting in Gandhinagar till this meeting, it was always filled with warmth and I always leave the meeting with admiration for him and his commitment and… pic.twitter.com/mu9RtgcwPQ
— Pawan Kalyan (@PawanKalyan) November 27, 2024
తాజావార్తలు
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..