Loksabha Elections : ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో రాజధాని ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్-రాజౌరీ, ఒడిశాలోని పూరీ సీటుకు సంబంధించిన అన్ని స్థానాల్లో ఓటింగ్ సమయంలో ఈవీఎంలు చెడిపోయినట్లు సమాచారం.
ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో ఉదయం 9 గంటల సమయానికి 10.82 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో 8.94 శాతం, ఉత్తరప్రదేశ్లో 12.33 శాతం, బీహార్లో 9.66 శాతం, పశ్చిమ బెంగాల్లో 16.54 శాతం నమోదు అయింది.
Hyderabad: దేశంతో పాటు అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతి రోజు రోజుకు పెరుగుతోంది. ఐటీ, ఫార్మా రంగాలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉంది.
ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని బాంకెట్ హాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో నగరంలోని 50 ఇంజిన్లను ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సమాచారం. కాకపోతే బాంకెట్ హాల్ మొత్తం కాలిపోయింది. అలీపూర్లోని కార్నివాల్ బాంక్వెట్ హాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘ్తాంకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Shocking: బిడ్డ లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు చీల్చిన కసాయి భర్త..…
Asaduddian Owaisi: ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ సమయంలో అడ్డంకులు సృష్టించాలని బీజేపీ భావిస్తోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలు కూడా ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలోని ఏడు స్థానాలకు ఎన్నికల ప్రచారానికి గురవారంతో తెరపడింది.
Sonia Gandhi: కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి వీడియో సందేశంలో ప్రసంగించారు. మే 25న ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది.
Aravind Kejriwal: స్వాతి మలివాల్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ పోలీసులు అతని తల్లిదండ్రులను విచారించాలనుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.