Lok Sabha Election Phase 6: ఆరో విడత లోక్సభ ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election Phase 6: ఆరు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 58 ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా 77.99 శాతం ఓటింగ నమోదు కాగా, ఢిల్లీలో 53.73 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ రోజు జరిగిన 6 ఫేజ్ ఎన్నికల్లో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇంద్రజిత్ సింగ్, బీజేపీకి చెందిన మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ ఖట్టర్ మరియు మనోజ్ తివారీ ఎన్నికల బరిలో ఉన్నారు. కాశ్మీరీ నేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్కి చెందిన కన్హయ్య కుమార్ పోటీ చేశారు. ఓటింగ్ దాదాపుగా ప్రశాంతంగా జరగగా, పశ్చిమ బెంగాల్లోని ఘటల్, కంఠి నియోజకవర్గాల పరిధిలో అధికార తృణమూల్, బీజేపీ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఝార్గ్రామ్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిపై టీఎంసీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి.
Also Read
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
Read Also: CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..
ఆరో విడతలో హర్యానా (10), బీహార్ (8), జార్ఖండ్ (4), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (8), ఢిల్లీ (7), జమ్మూకశ్మీర్ (7) స్థానాలకు మొత్తంగా 58 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరిగింది. ఆరో దశ ముగిసే సమయానికి దేశంలోని మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. చివరిదైన ఏడో దశ జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ దశలో 57 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ఆరో విడత రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం:
* బీహార్- 52.24
* హర్యానా -55.93
* జమ్మూ-కాశ్మీర్-51.35
* జార్ఖండ్- 61.41
* ఢిల్లీ -53.73
* ఒడిశా- 59.60
* ఉత్తరప్రదేశ్ – 52.02
* పశ్చిమ బెంగాల్- 77.99
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..