Lok Sabha Election Phase 6: ఆరో విడత లోక్సభ ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదు..
Lok Sabha Election Phase 6: ఆరు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 58 ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా 77.99 శాతం ఓటింగ నమోదు కాగా, ఢిల్లీలో 53.73 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ రోజు జరిగిన 6 ఫేజ్ ఎన్నికల్లో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇంద్రజిత్ సింగ్, బీజేపీకి చెందిన మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ ఖట్టర్ మరియు మనోజ్ తివారీ ఎన్నికల బరిలో ఉన్నారు. కాశ్మీరీ నేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్కి చెందిన కన్హయ్య కుమార్ పోటీ చేశారు. ఓటింగ్ దాదాపుగా ప్రశాంతంగా జరగగా, పశ్చిమ బెంగాల్లోని ఘటల్, కంఠి నియోజకవర్గాల పరిధిలో అధికార తృణమూల్, బీజేపీ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఝార్గ్రామ్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిపై టీఎంసీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..
ఆరో విడతలో హర్యానా (10), బీహార్ (8), జార్ఖండ్ (4), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (8), ఢిల్లీ (7), జమ్మూకశ్మీర్ (7) స్థానాలకు మొత్తంగా 58 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరిగింది. ఆరో దశ ముగిసే సమయానికి దేశంలోని మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. చివరిదైన ఏడో దశ జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ దశలో 57 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ఆరో విడత రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం:
* బీహార్- 52.24
* హర్యానా -55.93
* జమ్మూ-కాశ్మీర్-51.35
* జార్ఖండ్- 61.41
* ఢిల్లీ -53.73
* ఒడిశా- 59.60
* ఉత్తరప్రదేశ్ – 52.02
* పశ్చిమ బెంగాల్- 77.99
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!