Lok Sabha Election Phase 6: ఆరో విడత లోక్సభ ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election Phase 6: ఆరు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 58 ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా 77.99 శాతం ఓటింగ నమోదు కాగా, ఢిల్లీలో 53.73 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ రోజు జరిగిన 6 ఫేజ్ ఎన్నికల్లో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇంద్రజిత్ సింగ్, బీజేపీకి చెందిన మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ ఖట్టర్ మరియు మనోజ్ తివారీ ఎన్నికల బరిలో ఉన్నారు. కాశ్మీరీ నేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్కి చెందిన కన్హయ్య కుమార్ పోటీ చేశారు. ఓటింగ్ దాదాపుగా ప్రశాంతంగా జరగగా, పశ్చిమ బెంగాల్లోని ఘటల్, కంఠి నియోజకవర్గాల పరిధిలో అధికార తృణమూల్, బీజేపీ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఝార్గ్రామ్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిపై టీఎంసీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..
ఆరో విడతలో హర్యానా (10), బీహార్ (8), జార్ఖండ్ (4), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (8), ఢిల్లీ (7), జమ్మూకశ్మీర్ (7) స్థానాలకు మొత్తంగా 58 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరిగింది. ఆరో దశ ముగిసే సమయానికి దేశంలోని మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. చివరిదైన ఏడో దశ జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ దశలో 57 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ఆరో విడత రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం:
* బీహార్- 52.24
* హర్యానా -55.93
* జమ్మూ-కాశ్మీర్-51.35
* జార్ఖండ్- 61.41
* ఢిల్లీ -53.73
* ఒడిశా- 59.60
* ఉత్తరప్రదేశ్ – 52.02
* పశ్చిమ బెంగాల్- 77.99
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!