దేశంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరత వెనుక వాతావరణ మార్పు ఒక ప్రధాన కారణం అయితే, మితిమీరిన వినియోగం, వృథా కూడా నీటి సంక్షోభ ప్రమాదాన్ని పెంచింది.
ఢిల్లీలోని చాందినీ చౌక్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 దుకాణాలు ఉన్న రెండు భవనాలు మంటల్లో కాలిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం బూడిదే కనిపిస్తుంది. 12 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో ధ్వంసమైన దుకాణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని.. వ్యాపారుల నష్టం కోట్లలో ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు.
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000…
ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని.. తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు.
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని 15 మ్యూజియంలకు తాజాగా బాంబు ఉన్నట్లు హెచ్చరికలు వచ్చినట్టు పోలీసులు ఇవాళ (బుధవారం) చెప్పుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. నగరంలో పలు చోట్ల తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కంప్లంట్లు పెరిగిపోయాయి. అప్రమత్తమైన ఆప్ ప్రభుత్వం.. సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి ఆప్ మంత్రి అతిషి లేఖ రాశారు.
దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే నీటి సంక్షోభంతో అల్లాడుతోంది. ఓ వైపు తీవ్రమైన ఎండ.. ఇంకోవైపు నీటి కొరత.. ఇలా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా మరో కొత్త కష్టం వచ్చి పడింది.
ఢిల్లీలో పీఎంవోలో ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బందితో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మోడీ పలు కీలక సూచనలు చేశారు
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. మోడీ ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందుగానే శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన మోడీ ప్రమాణస్వీకారానికి షేక్ హసీనా పాల్గొన్నారు. సోమవారం కూడా ఆమె పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది.