Metro Corridor: రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం..
- రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం
- మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమం
- రూ.6231 కోట్లతో రిథాలా-నరేలా-కుండ్లి మెట్రో కారిడార్ నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమమైంది. రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డీడీఏ (DDA) పంపింది. ఈ మేరకు శనివారం రాజ్నివాస్ వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మెట్రో కారిడార్ నిర్మాణ అంశాన్ని కేంద్రంతో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Also: Auto Accident: ఆటోలో నుంచి ఎగిరిపడ్డ డ్రైవర్.. ఆపై రోడ్డుపై ఉన్న మనుషులపైకి..
Also Read
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
రూ.6,231 కోట్లతో రిథాలా-నరేలా-కుండ్లి మెట్రో కారిడార్ను నిర్మించనున్నారు.ఇందులో ఢిల్లీలో పడే భాగానికి రూ.5,685.22 కోట్లు, హర్యానాలో పడే భాగానికి రూ.545.77 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రణాళిక ప్రకారం.. ఈ కారిడార్ ప్రస్తుత రెడ్ లైన్కు పొడిగింపుగా నిర్మించనున్నారు. మరోవైపు.. ఢిల్లీ భాగానికి అయ్యే ఖర్చులో 40 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) మిగిలిన ఖర్చుకు రూ. 1,000 కోట్లు సమకూరుస్తుంది. అయితే మూలధనంలో 37.5 శాతం ద్వైపాక్షిక / బహుపాక్షిక రుణాల నుండి వస్తుంది. ఖర్చులో 20 శాతం ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుంది.
Read Also: Rajeev Chandrasekhar: ఈవీఎంలను తొలగించాలన్న ఎలాన్ మస్క్.. వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి వివరణ
మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం సబ్సిడీని అందిస్తుంది. మిగిలిన 20 శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ లైన్ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తవుతుందని, 26.5 కిలోమీటర్ల పొడవునా 21 స్టేషన్లు ఉంటాయన్నారు. ఇది నరేలా, బవానా మరియు అలీపూర్ ప్రాంతాలను నగరంలోని మిగిలిన ప్రాంతాలతో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని.. మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!