Heat Wave: అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడురోజుల పాటు వేడిగాలులు
- దేశంలోని అనేక ప్రాంతాల్లో దంచుతున్న ఎండలు
- వీపరీతంగా వీస్తున్న వేడిగాలులు
- ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికం
- జూన్ 16 నుండి 18 వరకు తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం- వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 16 నుండి 18 వరకు ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా.. జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మరియు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. జూన్ 16 మరియు 17 తేదీలలో.. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ , బీహార్ మరియు జార్ఖండ్లోని వివిధ ప్రాంతాలలో హీట్ వేవ్ కొనసాగనుంది.
జూన్ 16, 17 తేదీలలో.. పంజాబ్, హర్యానా-చండీగఢ్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో రాత్రిపూట వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో.. జూన్ 16-18 మధ్య, జూన్ 16న ఢిల్లీ, మహారాష్ట్రలోని విదర్భలో రాత్రి వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. జూన్ 17 నుండి 20 వరకు ఒడిశాలో వాతావరణం వేడి, తేమగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
- Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
Anagani Satya Prasad: “తాడేపల్లి, లోటస్ పాండ్ లోని జగన్ ఇళ్లలో ప్రభుత్వ ధనంతో ఫర్నీచర్”
గత 24 గంటల్లో హర్యానా, ఢిల్లీలోని చాలా ప్రాంతాలు, పంజాబ్లోని అనేక ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర ఒడిశా మరియు ఏకాంత ప్రాంతాలు గంగా పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. గత 24 గంటల్లో కాన్పూర్ IAF (తూర్పు ఉత్తరప్రదేశ్)లో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే.. వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సగటు కంటే ఆరు డిగ్రీలు అధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆదివారం కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. మరోవైపు.. పంజాబ్లో జూన్ 18 వరకు వేడి, విపరీతమైన వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Tags
- Alert
- Delhi
- Heat Waves
- IMD
- telugu news
తాజావార్తలు
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!