Heat Wave: అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడురోజుల పాటు వేడిగాలులు
- దేశంలోని అనేక ప్రాంతాల్లో దంచుతున్న ఎండలు
- వీపరీతంగా వీస్తున్న వేడిగాలులు
- ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికం
- జూన్ 16 నుండి 18 వరకు తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం- వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 16 నుండి 18 వరకు ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా.. జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మరియు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. జూన్ 16 మరియు 17 తేదీలలో.. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ , బీహార్ మరియు జార్ఖండ్లోని వివిధ ప్రాంతాలలో హీట్ వేవ్ కొనసాగనుంది.
జూన్ 16, 17 తేదీలలో.. పంజాబ్, హర్యానా-చండీగఢ్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో రాత్రిపూట వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో.. జూన్ 16-18 మధ్య, జూన్ 16న ఢిల్లీ, మహారాష్ట్రలోని విదర్భలో రాత్రి వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. జూన్ 17 నుండి 20 వరకు ఒడిశాలో వాతావరణం వేడి, తేమగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Anagani Satya Prasad: “తాడేపల్లి, లోటస్ పాండ్ లోని జగన్ ఇళ్లలో ప్రభుత్వ ధనంతో ఫర్నీచర్”
గత 24 గంటల్లో హర్యానా, ఢిల్లీలోని చాలా ప్రాంతాలు, పంజాబ్లోని అనేక ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర ఒడిశా మరియు ఏకాంత ప్రాంతాలు గంగా పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. గత 24 గంటల్లో కాన్పూర్ IAF (తూర్పు ఉత్తరప్రదేశ్)లో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే.. వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సగటు కంటే ఆరు డిగ్రీలు అధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆదివారం కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. మరోవైపు.. పంజాబ్లో జూన్ 18 వరకు వేడి, విపరీతమైన వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Tags
- Alert
- Delhi
- Heat Waves
- IMD
- telugu news
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..