Heat Wave: అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడురోజుల పాటు వేడిగాలులు
- దేశంలోని అనేక ప్రాంతాల్లో దంచుతున్న ఎండలు
- వీపరీతంగా వీస్తున్న వేడిగాలులు
- ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికం
- జూన్ 16 నుండి 18 వరకు తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం- వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 16 నుండి 18 వరకు ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా.. జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మరియు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. జూన్ 16 మరియు 17 తేదీలలో.. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ , బీహార్ మరియు జార్ఖండ్లోని వివిధ ప్రాంతాలలో హీట్ వేవ్ కొనసాగనుంది.
జూన్ 16, 17 తేదీలలో.. పంజాబ్, హర్యానా-చండీగఢ్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో రాత్రిపూట వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో.. జూన్ 16-18 మధ్య, జూన్ 16న ఢిల్లీ, మహారాష్ట్రలోని విదర్భలో రాత్రి వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. జూన్ 17 నుండి 20 వరకు ఒడిశాలో వాతావరణం వేడి, తేమగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
Anagani Satya Prasad: “తాడేపల్లి, లోటస్ పాండ్ లోని జగన్ ఇళ్లలో ప్రభుత్వ ధనంతో ఫర్నీచర్”
గత 24 గంటల్లో హర్యానా, ఢిల్లీలోని చాలా ప్రాంతాలు, పంజాబ్లోని అనేక ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర ఒడిశా మరియు ఏకాంత ప్రాంతాలు గంగా పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. గత 24 గంటల్లో కాన్పూర్ IAF (తూర్పు ఉత్తరప్రదేశ్)లో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే.. వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సగటు కంటే ఆరు డిగ్రీలు అధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆదివారం కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. మరోవైపు.. పంజాబ్లో జూన్ 18 వరకు వేడి, విపరీతమైన వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Tags
- Alert
- Delhi
- Heat Waves
- IMD
- telugu news
తాజావార్తలు
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
-
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!