Heat Wave: అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడురోజుల పాటు వేడిగాలులు
- దేశంలోని అనేక ప్రాంతాల్లో దంచుతున్న ఎండలు
- వీపరీతంగా వీస్తున్న వేడిగాలులు
- ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికం
- జూన్ 16 నుండి 18 వరకు తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం- వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 16 నుండి 18 వరకు ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా.. జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మరియు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. జూన్ 16 మరియు 17 తేదీలలో.. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ , బీహార్ మరియు జార్ఖండ్లోని వివిధ ప్రాంతాలలో హీట్ వేవ్ కొనసాగనుంది.
జూన్ 16, 17 తేదీలలో.. పంజాబ్, హర్యానా-చండీగఢ్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో రాత్రిపూట వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో.. జూన్ 16-18 మధ్య, జూన్ 16న ఢిల్లీ, మహారాష్ట్రలోని విదర్భలో రాత్రి వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. జూన్ 17 నుండి 20 వరకు ఒడిశాలో వాతావరణం వేడి, తేమగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
Anagani Satya Prasad: “తాడేపల్లి, లోటస్ పాండ్ లోని జగన్ ఇళ్లలో ప్రభుత్వ ధనంతో ఫర్నీచర్”
గత 24 గంటల్లో హర్యానా, ఢిల్లీలోని చాలా ప్రాంతాలు, పంజాబ్లోని అనేక ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర ఒడిశా మరియు ఏకాంత ప్రాంతాలు గంగా పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. గత 24 గంటల్లో కాన్పూర్ IAF (తూర్పు ఉత్తరప్రదేశ్)లో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే.. వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సగటు కంటే ఆరు డిగ్రీలు అధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆదివారం కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. మరోవైపు.. పంజాబ్లో జూన్ 18 వరకు వేడి, విపరీతమైన వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Tags
- Alert
- Delhi
- Heat Waves
- IMD
- telugu news
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!