Kuwait Fire Accident: మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటిన కొచ్చి, ఢిల్లీ ఎయిర్ పోర్టులు
- స్వగ్రామాలకు చేరిన కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు
- బాధితుల ఇళ్లలో హృదయ విదారక దృశ్యాలు
- అగ్నిప్రమాదంలో గాయపడిన మరో భారతీయుడు మృతి
- 46కి చేరిన మరణించిన భారతీయుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కువైట్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారిలో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. అయితే వారి మృతదేహాలు ఈరోజు రాష్ట్రానికి వచ్చాయి. మృతదేహాలకు రాష్ట్ర ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికింది. రాష్ట్రంలోని వలస సమాజాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద సంఘటనలలో ఇది ఒకటి. మరోవైపు.. బాధితుల ఇళ్లలో చోటు చేసుకున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు వారి ఇళ్లకు చేరుకోగా.. వారి బంధువులు, స్నేహితులు మరియు ఇరుగుపొరుగు వారిని ఓదార్చడం కష్టమైంది. ఇదిలా ఉంటే.. కువైట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో గాయపడిన మరో భారతీయుడు మరణించాడు. దీంతో మరణించిన భారతీయుల సంఖ్య 46కి చేరింది.
TTD EO: టీటీడీ కొత్త ఈవోగా శ్యామల రావు.. ఉత్తర్వులు జారీ
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
శుక్రవారం సాయంత్రం నాటికి.. చాలా మంది బాధితుల మృతదేహాలను వారి మతపరమైన ఆచారాల ప్రకారం దహనం చేశారు. కొన్ని కుటుంబాలు విదేశాల నుండి తమ దగ్గరి బంధువుల రాక కోసం ఎదురుచూస్తున్నందున మృతదేహాలను తరువాత దహనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. మృతదేహాలు కొచ్చిన్ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విమానం నుంచి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తుండగా.. అక్కడ ఉన్న వారి సన్నిహితులు తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యారు. అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సి-130 జె ద్వారా శుక్రవారం స్వదేశానికి తీసుకువచ్చారు. కేరళ (23), తమిళనాడు (7), కర్ణాటక (1) నివాసితుల మృతదేహాలతో వైమానిక దళం విమానం కువైట్ నుండి మొదట కొచ్చికి చేరుకుంది.
PM Modi: జెలెన్స్కీతో మోడీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక ప్రకటన
ఆ తరువాత.. నార్త్ ఇండియన్ బాధితుల 14 మృతదేహాలతో ఎయిర్ ఫోర్స్ విమానం న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఇందులో రెండు మృతదేహాలు హర్యానాకు చెందినవి కాగా, ఒకటి పంజాబ్కు చెందినది. మృతదేహాలను ఢిల్లీ ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చిన రాష్ట్రాల్లో హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు జార్ఖండ్లకు చెందిన వారు ఉన్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ మృతదేహాలతో కువైట్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు. కొచ్చిలో అవసరమైన సెక్యూరిటీ క్లియరెన్స్ కారణంగా శవపేటికలను బయటకు తీసుకురావడానికి గంట సమయం పట్టింది. దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన మృతుల మృతదేహాలను ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలు ఉదయం నుంచి ఇక్కడకు చేరుకుని తమ ఆత్మీయుల మృతదేహాల కోసం ఎదురుచూశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!