ఏపీ క్యాబినెట్ విస్తరణకు అడుగులు శరవేగంగా సాగుతున్నాయి. నిన్ననే ఏపీ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఏర్పాట్లపై సీఎస్ డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో వర్చువల్గా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ప్రమాణ…
ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రిప్లై ఇచ్చారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న రూల్ 17 నియమానికి అనుగుణంగానే తాను మీడియాతో మాట్లాడినట్లు తెలిపారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పాను. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.…
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల విభజన జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ రోజు నుంచి 26 జిల్లాల ఆంధ్రరాష్ట్రంగా రూపు మారుతోందని, కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ, గిరి బిడ్డలు, వాగ్గేయ కారులు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పేర్లు పెట్టామన్నారు. గతంలో ఉన్న 13 జిల్లాల కేంద్రాలను అలాగే కాపాడాం. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా, 1979 జూన్ లో…
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై సీఎస్ సమీర్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్లో కీలక అంశాలు ప్రస్తావించారు.. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6 నెలలు కాదు.. 60 నెలలు కావాలని పేర్కొన్నారు.. రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే రెండు నెలల సమయం అవసరమన్న ఆయన.. అమరావతిలో పనులు మొదలు పెట్టేందుకే 8 నెలల సమయం పడుతుందన్నారు.. రోడ్ల నిర్మాణం కోసం 16 నెలలు అవసరం అవుతుందని.. రోడ్ల పనులు పూర్తి చేశాక, డ్రైనేజి,…
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల నుంచే కొత్త జిల్లాల (New Districts) నుంచి పరిపాలన సాగాలన్న సర్కార్ ఆదేశంతో చర్యలు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ నెల 25వ తేదీలోగా కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సమీర్ శర్మ ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు.. కలెక్టర్లు.. ఎస్పీలతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రేపో, ఎల్లుండో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షంచనున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల…
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో దూకుడు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల నుంచే కొత్త జిల్లాల నుంచి పరిపాలన సాగాలన్న సర్కార్ ఆదేశంతో చర్యలు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ నెల 25వ తేదీలోగా కొత్త జిల్లాల్లో మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేవారు.. వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సీఎస్.. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక, రేపో, ఎల్లుండో కొత్త…
ఏపీలో ఉపాధి హామీ పథకం పనుల బిల్లుల చెల్లింపు వ్యవహారం నిత్యం హాట్ టాపిక్ అవుతూనే వుంది. నరేగా బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నరేగా బిల్లులు చెల్లించలేదని హైకోర్ట్లో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలయిన సంగతి తెలిసిందే. 300 పిటిషన్లను విచారించింది హైకోర్టు. ఈ నెల 21వ తేదీలోపు నరేగా బిల్లులను చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది హైకోర్ట్. బిల్లులు చెల్లింపులో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు హైకోర్టుకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన…
ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ని నియమించేందుకు రంగం సిద్ధం అయింది. పీఆర్సీపై అసహనంతో ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి…
పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు.. విజయవాడలోని రోడ్లు.. ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి.. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయారు.. పెద్ద ఎత్తున అరెస్ట్ లు, నిర్బంధాలు కూడా వారిని ఆపలేకపోయాయి.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు తరలివచ్చారని తెలిపారు.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను…
పీఆర్సీ విషయంలో ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అయితే, సమ్మె విరమించండి.. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఉద్యోగులను కోరారు సీఎస్ సమీర్ శర్మ… మా కుటుంబంలో కోపం ఉంటే మాట్లాడుకుంటాం.. కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. అసలు సమ్మె చేస్తే ఏమి వస్తుందని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇచ్చిన ఐఆర్ సుమారు 30 నెలల పాటు ఇచ్చాం.. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్…