నైరుతి రుతుపవనాలుఆలస్యంగా ప్రవేశించినప్పటికీ ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. రుతు పవనాల మూలంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా అడపాదడపా కురిసిన వర్షంతో శుక్రవారం సాయంత్రం ముంబయిలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ప్రస్తుతం దేశంలో పెట్రోలు రేట్లు మండిపోతున్నాయి. చమురు ధరలు రోజూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దాటేశాయి. దేవుడా.. బండి అనవసరంగా కొన్నామని కొందరు.. తప్పడం లేదు అని కొందరు నెత్తి బాదుకుంటూనే వాహనాలను నడుపుతున్నారు. అయితే ఈ రేట్లు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. మనకంటే ఎక్కువ ధరలు ఉన్న దేశాలు కొన్ని ఉండగా.. కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర చాక్లెట్ కన్నా…
నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశమంతటా విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జులై 8న నైరుతి రుతుపవనాలు దేశమంతటికీ విస్తరిస్తుంటాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో చిట్టచివరిగా వర్షాలు కురిసే రాజస్థాన్లోని జైసల్మేర్, గంగానగర్కు వర్షాలు విస్తరించినప్పటికీ ఢిల్లీ-ఎన్సిఆర్లో మాత్రం మొహం చాటేశాయి. కాగా, మంగళవారం ఢిల్లీ-ఎన్సిఆర్లో కూడా వర్షాలు పడడంతో నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రావాల్సి ఉన్న నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళ తీరాన్ని…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి… రికవరీ రేటు పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేసింది కేంద్రం… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్… పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. మే 3వ తేదీన రికవరీ రేటు 81.7 శాతం ఉందన్న ఆయన.. ఇప్పుడు అది 85.6 శాతానికి చేరిందన్నారు. ఇక, గత 24 గంటల్లో కోవిడ్నుం చి 4,22,436 మంది కోలుకున్నట్టు వెల్లడించారు లవ్ అగర్వాల్.. దేశంలో ఇంత భారీ…