Jobs In Country: దేశంలో ఉద్యోగాల జాతర.. 7 నెలల పాటు కొనసాగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jobs In Country: దేశంలో ఎన్నికల వాతావరనం వచ్చేసింది. ఈ ఏడాది డిసెంబర్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు తోడు ఆగస్టు చివరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ పండుగలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పనిచేయడానికి.. అలాగే పండుగల కోసం వివిధ కంపెనీలు, సంస్థల్లో పనిచేయడానికి ఉద్యోగులు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నెలాఖరు నుంచే ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిలో కొత్త ఉద్యోగాలతో పాటు.. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేసేందుకూ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం తాత్కాలిక పద్ధతిలో జరిగే నియామకాలే ఎక్కువగా ఉండనున్నాయి. 1200 కు పైగా నియామక సంస్థలు, కన్సల్టెంట్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో, నౌక్రీ హైరింగ్ ఔట్లుక్ పేరిట నివేదికను సోమవారం విడుదల చేసింది. ఆగస్టు చివరి వారం నుంచి సుమారు 7 నెలల పాటు పలు సెక్టార్లలో నిపుణులైన యువతకు అవకాశాలు రాబోతున్నాయని.. మార్కెట్ సర్వేలు, సిబ్బంది సేవల సంస్థలు మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా, టీమ్లీజ్, లింక్డ్ఇన్ వంటి సంస్థలు చెప్తున్నాయి.
Read also: NCL Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 338 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
Also Read
ఎన్నికల సీజన్ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిజిటల్ వినియోగం పెరిగనుంది. రాజకీయ పార్టీలు సరికొత్త విధానాలను అనుసరిస్తున్నాయి. ఐటీ, సోషల్ మీడియాను తమ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ నిపుణుల అవసరం పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు ఆగస్టు నుంచి పండుగల సీజన్ మొదలవుతోందని, కొనుగోళ్ల సందడితో ఈ–కామర్స్ జోరందుకుంటుందని అంటున్నాయి. ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. సర్వేలో పాల్గొన్న 92 శాతం మంది నియామకాలు పెరుగుతాయని అంచనా వేస్తుండగా.. 47 శాతం మంది రిక్రూటర్లు కొత్త అవకాశాలు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ పెరుగుతాయని పేర్కొన్నారు. 26 శాతం మంది కేవలం కొత్త ఉద్యోగాలే పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. 20 శాతం మంది తమ ఉద్యోగుల సంఖ్య యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేయగా… కేవలం 4 శాతం మందే ఉద్యోగాల్లో కొంత మేరకు కోత ఉంటుందని తెలిపారు.
Read also: Mirror Break: పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచితే.. అరిష్టమా?
బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ లాంటి ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉంటుందని రిక్రూటర్లు భావిస్తున్నారు. కాస్త అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఉండబోతోంది. అనుభవం ఉన్న వారి తరువాత ప్రెషర్లకు అవకాశాలుంటాయి. సర్వేలో పాల్గొన్న దాదాపు 70 శాతం మంది రిక్రూటర్లు రాబోయే 7 నెలల్లో ఉద్యోగుల వలసల రేటు 15 శాతం లోపు ఉంటుందని చెబుతుండగా.. మరికొంతమంది మాత్రం 40 శాతం వరకు కొనసాగవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో ..ఉద్యోగులు తాము ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొనసాగేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, మానవ వనరుల విభాగాల్లో అనుభవజ్ఞులు అత్యధికంగా ఉద్యోగాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ప్రస్తుత సీజన్లో దేశవ్యాప్తంగా 7 లక్షల మందికిపైగా ఉద్యోగులను పలు కంపెనీలు తాత్కాలికంగా నియమించుకునే వీలుందని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా, టీమ్లీజ్, లింక్డ్ఇన్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!